Mohammad Siraj : క్రికెట్ను వదిలేసి.. వెళ్లి ఆటో తోలుకోమన్నారు.! : మహమ్మద్ సిరాజ్
టీమ్ఇండియా ప్రధాన పేసర్గా రాణిస్తున్న హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్.. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన కష్టాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిర్వహిస్తున్న..
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా ప్రధాన పేసర్గా రాణిస్తున్న హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్.. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన కష్టాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిర్వహిస్తున్న ‘పాడ్కాస్ట్’లో పంచుకున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్లో చేసిన పేలవ ప్రదర్శన తర్వాత.. సామాజిక మాధ్యమాల్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పాడు. కొందరైతే క్రికెట్ను వదిలేసి.. వెళ్లి ఆటో తోలుకోమని సలహా ఇచ్చారని పేర్కొన్నాడు.
2019 ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఆడిన 9 మ్యాచుల్లో 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఓ మ్యాచులో సిరాజ్ 2.2 ఓవర్లలోనే ఐదు సిక్సులు సహా 36 పరుగులు ఇచ్చాడు. ఇందులో రెండు బీమర్లు (నేరుగా స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న బ్యాటర్ అవతల బంతి విసరడం) ఉన్నాయి. ఈ సీజన్లోనే బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ముగించింది.
* మహీ భాయ్ సలహాతో..
‘కోల్కతా జట్టుతో జరిగిన ఆ మ్యాచులో నేను రెండు బీమర్లు వేసిన తర్వాత.. ట్రోలింగ్ మొదలైంది. ‘క్రికెట్ వదిలేసి.. వెళ్లి మీ నాన్నలా ఆటో తోలుకో’అని హేళన చేసేవారు. ఇంకా రకరకాల కామెంట్లు వచ్చాయి. అప్పుడు నాకు టీమ్ఇండియాకు ఎంపికైన కొత్తలో మహీ భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ‘బయటి వాళ్లు ఏమన్నా పట్టించుకోకు. నువ్వు మెరుగ్గా రాణిస్తే.. నిన్ను తిట్టిన వాళ్లే పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తారు. విఫలమైతే విమర్శిస్తుంటారు. అందుకే, అలాంటి కామెంట్లను సీరియస్గా తీసుకోకు’ అని మహీ భాయ్ చెప్పాడు. ఆ రోజు మహీ భాయ్ చెప్పిన మాటలే నేడు నిజమయ్యాయి. అప్పడు నన్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లే.. ఇప్పడు ప్రశంసిస్తున్నారు. ‘నువ్వు గొప్ప బౌలర్వి భాయ్’ అని పొగుడుతున్నారని సిరాజ్ చెప్పాడు.
ఒకప్పుడు పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకే దూరమయ్యే పరిస్థితి నుంచి.. అదే జట్టులో ప్రధాన బౌలర్ స్థాయికి ఎదిగేందుకు ఎంతో శ్రమించానని సిరాజ్ చెప్పాడు. వచ్చే సీజన్ కోసం బెంగళూరు యాజమాన్యం రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లలో సిరాజ్ పేరు దక్కించుకోవడం గమనార్హం. ఇతడితో పాటు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్లను కూడా బెంగళూరు రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM