‘301’ క్యాప్.. వెలకట్టలేని సంపద
టీమ్ఇండియా టెస్టు క్యాప్ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు క్యాప్ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు తాజాగా తన తండ్రి సుందర్తో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో సుందర్ తన కుమారుడి అరంగేట్రం టెస్టు క్యాప్ ‘301’ను చూస్తూ ఆనందించారు. అది వెలకట్టలేని సంపదని వాషింగ్టన్ ట్వీట్ చేశాడు.
కాగా, వాషింగ్టన్ తండ్రి సుందర్ ఒకప్పుడు రంజీ ప్లేయర్. వాషింగ్టన్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయనకు చిన్నతనంలో క్రికెట్ ఆడడానికి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ మాజీ అధికారిపై ప్రేమతో తన కుమారుడికి వాషింగ్టన్ అనే పేరుపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్లో రాణించిన ఈ యువ ఆల్రౌండర్ తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. అయితే, సీనియర్ ఆటగాళ్లంతా గాయాల బారిన పడడంతో ‘గబ్బా టెస్టు’లో అనూహ్యంగా అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని అందరిచేతా ప్రశంసలు పొందాడు.
గబ్బా టెస్టులో వాషింగ్టన్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసి బ్యాటింగ్లో తొలి ఇన్నింగ్స్లో 62, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె చేతుల మీదుగా ఆ టెస్టు ఆరంభంలో వాషింగ్టన్ ‘టీమ్ఇండియా 301’వ టెస్టు క్రికెటర్గా టోపీ అందుకున్నాడు. దాన్నే తన తండ్రికి చూపిస్తూ వాషింగ్టన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇదే సిరీస్లో టీమ్ఇండియా వాషింగ్టన్తో కలిపి ఆరుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అందులో నటరాజన్, నవ్దీప్సైని, మహ్మద్ సిరాజ్, శుభ్మన్గిల్, శార్దూల్ ఠాకుర్ (గతంలో ఒక టెస్టు ఆడి మధ్యలోనే గాయపడ్డాడు) ఉన్నారు.
ఇవీ చదవండి..
ఆ ఆరుగురికిఎస్యూవీ కార్లు
ద్రవిడ్ సలహా పాటిస్తే మేలు : పీటర్సన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?