టెయిలెండర్లు నిలవలేకపోవడం బాధ కలిగించింది
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం సుందర్ విచారం వ్యక్తం చేశారు...
వాషింగ్టన్ సుందర్ శతకం కోల్పోవడంపై తండ్రి విచారం..
(Photo: BCCI)
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం సుందర్ విచారం వ్యక్తం చేశారు. మొతేరా వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా శనివారం ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతకుముందు 294/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా చివరికి 365 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్(43; 97 బంతుల్లో 5x4, 1x6), వాషింగ్టన్ సుందర్(96*; 174 బంతుల్లో 10x4, 1x6) రాణించి ఏడో వికెట్కు శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే సుందర్ తొలి టెస్టు సెంచరీకి చేరువైన వేళ అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. ఆపై ఇషాంత్(0), మహ్మద్ సిరాజ్(0) సైతం వెనువెంటనే ఔటవ్వడంతో సుందర్ తొలి అంతర్జాతీయ శతకానికి చేరువలో నాటౌట్గా నిలిచిపోయాడు.
ఇదే విషయంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వాషింగ్టన్ తండ్రి.. తన కుమారుడు సెంచరీకి చేరువలో ఉండగా, టెయిలెండర్లు వికెట్లు కాపాడుకోలేకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. ‘టెయిలెండర్ల పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. కొద్దిసేపు కూడా వాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఒకవేళ టీమ్ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ ఇలా వికెట్లు కోల్పోతే ఎలా ఉంటుంది? అది భారీ తప్పిదం కాదా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ను ఎంతో మంది యువ క్రికెటర్లు వీక్షిస్తారని.. ఈ టెయిలెండర్ల ఆట చూసి వాళ్లు అలా నేర్చుకోవద్దని సుందర్ తండ్రి చెప్పుకొచ్చారు. ఆ స్థితిలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టెక్నిక్, నైపుణ్యాలు అవసరం లేదని, అక్కడ ధైర్యంగా నిలబడటం ఒక్కటే కావాలని అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఇదే సిరీస్లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ వాషింగ్టన్ 85* పరుగులతో నిలిచి శతకాన్ని చేరుకోలేకపోయాడు. అప్పుడు కూడా టెయిలెండర్లు త్వరగా ఔటవ్వడంతో ఈ యువ ఆల్రౌండర్ తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం