తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్ చేసిన సుందర్
టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్కు క్రికెట్ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్ అన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్ ఆడాడని తెలిపారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్గా భావిస్తారని నిజానికి అతడు...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్కు క్రికెట్ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్ ఆడాడని వెల్లడించారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్గా భావిస్తారని నిజానికి అతడు 70% బ్యాట్స్మన్ అని పేర్కొన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ముందు వాషింగ్టన్ తనతో మాట్లాడాడని వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన సుందర్ బ్యాటు, బంతితో అదరగొడుతున్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 31 ఓవర్లు విసిరి 89 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 18 ఓవర్లు విసిరి 80 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 7 బౌండరీలు, 1 సిక్సర్ బాదేశాడు. శార్దూల్ ఠాకూర్ (67; 115 బంతుల్లో 9×4, 2×6)తో కలిసి ఏడో వికెట్కు 123 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. ఈ ఆనందాన్ని సుందర్ తండ్రి మీడియాతో పంచుకొన్నారు. బాల్యం నుంచే అతడిలో పోరాటతత్వం ఉండేదని వివరించారు.
‘వాషింగ్టన్కు తొమ్మిదేళ్లు ఉంటాయి. అండర్-14 అంతర్ పాఠశాలల మ్యాచుకు కొన్ని రోజుల ముందే సాధన చేస్తుండగా అతడి తలకు గాయమైంది. ఐదు కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి 39 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచును గెలిపించాడు. అతడు సవాళ్లకు భయపడడని ఆ రోజే నాకు అర్థమైంది. ఐపీఎల్, టీ20ల్లో వాషింగ్టన్ను చూసినవాళ్లంతా అతడిని ఆఫ్స్పిన్నర్గా భావిస్తుంటారు. అది నిజం కాదు. బ్యాటింగ్ పరంగా అతడు అత్యంత ప్రతిభావంతుడని నా విశ్వాసం. నిజానికి అతడు 70% బ్యాట్స్మన్’ అని సుందర్ అన్నారు.
శనివారం మ్యాచులో మూడు వికెట్లు తీసిన తర్వాత వాషింగ్టన్ తనకు వాట్సప్ కాల్ చేశాడని సుందర్ చెప్పారు. ‘క్లుప్తంగా మా సంభాషణ సారాంశం ఇది. ఈ మ్యాచులో నువ్వు చేయాల్సిన పనింకా పూర్తవ్వలేదు. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చేయాలి. ఇదో అరుదైన అవకాశం. దీనిని కచ్చితంగా అందిపుచ్చుకోవాలని చెప్పాను’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం నాలుగో టెస్టు ఐదో రోజుకు చేరుకుంది. ఆఖరి రోజు టీమ్ఇండియా 324 పరుగులు చేస్తే విజయం అందుకుంటుంది. అయితే వర్షం ముప్పు పొంచిఉంది.
ఇవీ చదవండి
ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్