Wasim Jaffer: కోహ్లీపై ట్వీట్.. అదిరిపోయే జవాబిచ్చిన జాఫర్
టీమ్ఇండియా మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్ పోస్టు చేయడంలోనైనా...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్ పోస్టులు చేస్తుంటాడు. ఇక ఎవరైనా ఏదైనా పోస్టులు పెడితే వాటికి తగ్గట్టుగా స్పందించడంలోనూ ఈ దేశవాళీ బ్యాటింగ్ దిగ్గజం అందరికన్నా ముందుంటాడు. తాజాగా ఓ ఆస్ట్రేలియన్ వెబ్సైట్కు సైతం జాఫర్ అలాంటి చురకలే అంటించి వార్తల్లో నిలిచాడు.
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. 2019 నవంబర్లో కోల్కతా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో బంగ్లాదేశ్పై చివరిసారి శతకం బాదాడు. ఇక అప్పటి నుంచి విరాట్ ఇప్పటివరకూ మరో మూడంకెల స్కోర్ నమోదు చేయలేదు. దీంతో అతడి బ్యాటింగ్ సగటు కూడా ఈ మధ్య తగ్గింది. ఈ క్రమంలోనే ‘7Cricket’ అనే ఓ ఆస్ట్రేలియన్ వెబ్సైట్.. తాజాగా కోహ్లీ బ్యాటింగ్ సగటును ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్తో పోల్చింది. ‘స్టాట్ ఆఫ్ ది డే’ అని పేర్కొంటూ.. 2019 నుంచి టెస్టుల్లో స్టార్క్ సగటు 38.63, కోహ్లీ సగటు 37.17 ఉన్నాయని వారి ఫొటోలతో సహా ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన జాఫర్ తనదైన శైలిలోనే నవ్వుతున్న ఎమోజీ జత చేసి మరింత దీటుగా జవాబిచ్చాడు. టీమ్ఇండియా యువ పేసర్ నవ్దీప్ సైని (53.50) వన్డే కెరీర్ బ్యాటింగ్ సగటు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్స్మిత్ (43.34) కన్నా మెరుగ్గా ఉందంటూ రీట్వీట్ చేశాడు. దీనికి భారత అభిమానులు తెగ నవ్వుకుంటూ లైకులు, షేర్లు చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, మూడో టెస్టుకు ముందు అతడు తిరిగి నెట్స్లో సాధన చేయడంతో ఆ మ్యాచ్కల్లా ఫిట్నెస్ సాధిస్తాడని హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘మూడో టెస్టు వరకూ అన్ని రకాలుగా కోహ్లి సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. కసరత్తులు చేసుకోవడానికి అతడికి తగినంత సమయం దొరికింది. కేప్టౌన్లో నెట్ సెషన్స్ ద్వారా అతడు తిరిగి లయ అందుకుంటాడు. అతడితో మాట్లాడాక చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడనిపిస్తోంది’ అని ద్రవిడ్ తాజాగా మీడియాతో అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM