IND vs SL: జడేజా లేని లోటు ఎక్కడా కనిపించలేదు: వసీం జాఫర్
శ్రీలంకతో టీ20 సిరీస్లకు (IND vs SL) రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అందుబాటులో లేడు. అతడి స్థానంలో సుందర్ (sundar), అక్షర్ (Axar Patel) జట్టులో ఉన్నారు. వీరిద్దరూ ఆల్రౌండర్లు. వీరిద్దరిలో తొలి రెండు మ్యాచుల్లో అక్షర్ పటేల్ ఆడి మెప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకొంటున్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్లకు దూరమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో సిరీస్లకు ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ను టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. తొలి రెండు టీ20ల్లో వాషింగ్టన్ సుందర్ ఆడలేదు. అవకాశం వచ్చిన అక్షర్ పటేల్ మాత్రం అదరగొట్టేశాడు. ఇలాగే రాణిస్తే మాత్రం జట్టులో జడేజా లేని లోటును అక్షర్ తప్పకుండా తీరుస్తాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు.
‘‘భారత జట్టు రవీంద్ర జడేజాను మిస్ అయిందని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్లలో భారత్ తరఫున కీలక ఆటగాడిగా జడేజా మారాడు. అయితే ఇప్పుడు టీమ్ఇండియాకి అక్షర్ పటేల్ రూపంలో అద్భుతమైన క్రికెటర్ దొరికాడు. జడేజా జట్టుకు దూరమైనప్పటి నుంచి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. నాణ్యమైన క్రికెటర్గా అక్షర్ పటేల్ ఎదుగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న నెంబర్వన్ 1 స్పిన్ ఆల్రౌండర్. అందుకే జడేజాకు ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా మారాడు. పవర్ప్లే ఓవర్లలోనూ అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అయితే జడేజా అలా వేయలేడు’’
‘‘తొలి మ్యాచ్లో రాణించిన అక్షర్.. రెండో టీ20లో అద్భుతంగా ఆడాడు. ఆటగాడిగా అత్యుత్తమంగా పరిణితి చెందాడు. టెక్నిక్పరంగానూ ఇంప్రూవ్ అయ్యాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అక్షర్ ఇదే విధంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తే మాత్రం మరో చర్చకు దారి తీయడం ఖాయం’’ అని జాఫర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!