ఉఫ్.. మళ్లీ అదే పిచ్చా: రూట్..!
అసలే స్పిన్కు అనుకూలించే పిచ్లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టును టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ ఓ ఆట ఆడుకున్నాడు...
ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఆడుకున్న జాఫర్
ఇంటర్నెట్డెస్క్: అసలే స్పిన్కు అనుకూలించే పిచ్లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టును టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ ఓ ఆట ఆడుకున్నాడు. తాజాగా నాలుగో టెస్టుకు ముందు పలువురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొతేరా పిచ్ను పరిశీలిస్తున్న ఓ ఫొటోను ట్విటర్లో పంచుకొని.. దానికి సరదా వ్యాఖ్యలు జత చేశాడు. పిచ్ను పరిశీలిస్తున్న ఆటగాళ్ల మధ్య చర్చ ఎలా ఉంటుందనే విషయానికి జాఫర్ తనదైన శైలిలో హాస్యం జోడించాడు. అది సందర్భోచితంగా ఉండడంతో నెటిజన్లు సైతం ఆస్వాదిస్తున్నారు. జాఫర్ పంచుకున్న ఫొటోలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. స్టువర్ట్ బ్రాడ్, మార్క్వుడ్, జానీ బెయిర్స్టో, ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్తో పాటు కెప్టెన్ జోరూట్ ఉన్నారు. దీంతో వారి మధ్య సంభాషణ ఇలా సాగిందని రాసుకొచ్చాడు.
స్టువర్ట్ బ్రాడ్: ఈ పిచ్ను చూస్తుంటే నా టూర్ అయిపోయిందని అనుకుంటున్నా.
మార్క్వుడ్: కనీసం నువ్వు రెండు టెస్టులైనా ఆడావు. (మార్క్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు)
బెయిర్స్టో: నాకు ఫ్లాట్ పిచ్ తయారు చేయలేదా? (పింక్బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో డకౌట్)
కాలింగ్వుడ్: ఈ పిచ్ మీద కూడా బంతి తిరుగుతుందా?
జోరూట్: ఉఫ్.. మళ్లీ అదే పిచ్?
అని పేర్కొంటూ జాఫర్ పోస్టు చేశాడు. దాంతో ఈ పోస్టు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇక గతవారం ఇదే పిచ్పై జరిగిన పింక్బాల్ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పై పలువురు ఇంగ్లాండ్, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్కు ఇలాంటి పిచ్ను తయారు చేయడం సరికాదని, ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నాలుగో టెస్టుకు స్పిన్కు అనుకూలించే వికెట్నే సిద్ధం చేస్తారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాఫర్ పర్యాటక జట్టును ఉద్దేశిస్తూ ట్రోలింగ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..