Team India: అశ్విన్పై అంత నమ్మకమా?
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్, రంజీ క్రికెట్ పరుగుల వీరుడు వసీమ్ జాఫర్ ఇటీవల ఏ సందర్భాన్నీ వదలడం లేదనే సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సందర్భోచితంగా ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ఇట్టే ఆకట్టుకునే మీమ్స్తో ఛలోక్తులు విసురుతూ నెటిజెన్లను అలరిస్తున్నాడు.
ఛాంపియన్షిప్ ఫైనల్స్పై జాఫర్ ట్రోలింగ్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్, రంజీ క్రికెట్ పరుగుల వీరుడు వసీమ్ జాఫర్ ఇటీవల ఏ సందర్భాన్నీ వదలడం లేదనే సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సందర్భోచితంగా ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ఇట్టే ఆకట్టుకునే మీమ్స్తో ఛలోక్తులు విసురుతూ నెటిజెన్లను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన విధి విధానాలను విడుదల చేయగా, జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు.
ప్రముఖ బాలీవుడ్ సినిమా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లోని ఓ సన్నివేశంలో హీరో సంజయ్ దత్ తరగతి గది నుంచి బయటకు వెళుతూ తన రూమ్మేట్ను పాఠం అర్థం చేసుకోమని, తర్వాత దాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పమనే డైలాగ్ ఉంటుంది. అయితే, ఐసీసీ ట్వీట్కు ఆ సన్నివేశానికి తగ్గ మీమ్తో జాఫర్.. ‘టీమ్ఇండియా పరిస్థితి ఇది’ అని పేర్కొంటూ, రవిచంద్రన్ అశ్విన్ను ఫస్ట్బెంచ్ స్టూడెంట్గా అభివర్ణిస్తూ.. ట్రోలింగ్ చేశాడు. అతడి ఉద్దేశం ఏమిటంటే.. ఐసీసీ విడుదల చేసిన ఛాంపియన్షిప్ విధివిధానాలను తొలుత అశ్విన్ అర్థం చేసుకోవాలని, ఆ తర్వాత వాటిని టీమ్ఇండియా ఆటగాళ్లకు వివరించాలనీ. ఎందుకంటే క్రికెట్లో ఏ విషయాన్నైనా అశ్విన్ చాలా త్వరగా అర్థం చేసుకుంటాడనే అభిప్రాయం ఉంది. దాంతో జాఫర్ ఇలాంటి పోస్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు.
కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా ఆ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఏదైనా అనుకోని కారణాల వల్ల ఆ ఐదు రోజుల్లో మ్యాచ్ సమయాన్ని కోల్పోతే రిజర్వ్డే కింద ఐసీసీ ఆరో రోజును కేటాయించింది. ఒకవేళ ఐదు రోజుల్లోనే ఫలితం తేలితే రిజర్వ్డేతో పనిలేదు. మ్యాచ్ డ్రాగా ముగిసినా, టై అయినా.. ఇరు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. మరోవైపు ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమ్ఇండియా ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో అశ్విన్ కూడా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM