Team India: టీమ్‌ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం

గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టును ఆడేందుకు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ మ్యాచ్‌ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా నుంచి లీసెస్టర్‌షైర్‌ జట్టుతో టీమ్‌ఇండియా

Published : 24 Jun 2022 01:53 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్‌)

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ మ్యాచ్‌ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా నుంచి లీసెస్టర్‌షైర్‌ జట్టుతో టీమ్‌ఇండియా నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ వార్మప్‌ మ్యాచ్‌ గురువారం ప్రారంభం కాగా.. పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతుండటం విశేషం. రిషభ్‌ పంత్‌, ఛెతేశ్వర్‌ పుజారా, జస్ప్రిత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

మైదానంలోకి వస్తున్న ఇరుజట్ల ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. కొంతమంది డోలు వాయిస్తుండగా పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళా నృత్యకారులు భాంగ్రా డ్యాన్స్‌ చేస్తూ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 42 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 15 వేల మంది లైక్ చేశారు. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని