Virat Kohli: కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. అనుష్క సంబరాలు చూడండి..

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. శనివారం గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 170/6 స్కోర్‌ చేసింది...

Published : 01 May 2022 11:32 IST

(Photo: Anushka Sharma Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌లో తొలి అర్ధ శతకం సాధించాడు. శనివారం గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 170/6 స్కోర్‌ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ (58; 53 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకంతో మెరిశాడు. దీంతో అతడి సతీమణి అనుష్క శర్మ గ్యాలరీలో సంబరాలు చేసుకుంది. 50 పరుగులు పూర్తి చేయగానే చప్పట్లు కొడుతూ కోహ్లీని ప్రోత్సహించింది. దీనికి సంబంధించిన వీడియోను టోర్నీ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ప్రదర్శనతో కోహ్లీ అభిమానులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని