Virat Kohli: డివిలియర్స్ను గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ భావోద్వేగం.. ఏం చెప్పాడో చూడండి!
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన...
ఈసారి కప్పుగెలిస్తే.. ఏబీనే గుర్తుచేసుకుంటా: కోహ్లీ
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడూ సోదరుల్లా కలిసి మెలిసి తిరుగుతారు. అయితే, డివిలియర్స్ గతేడాది నవంబర్లో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకడంతో ఈసారి మెగా టోర్నీలో ఆడలేకపోతున్నాడు. అతడు లేకపోవడం ఎలా అనిపిస్తోందని కోహ్లీని అడగ్గా భావోద్వేగం చెందాడు. ఈసారి బెంగళూరు కప్పు గెలిస్తే తాను ఏబీని గుర్తుచేసుకుంటానని చెప్పాడు.
‘డివిలియర్స్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అతడు ఆటకు వీడ్కోలు పలికిన రోజు నాకింకా గుర్తుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత మేం దుబాయ్ నుంచి భారత్కు తిరిగి వచ్చేటప్పుడు నాకొక వాయిస్ నోట్ పెట్టాడు. అయితే, డివిలియర్స్ ఈ నిర్ణయం తీసుకుంటాడనే సందేహం నాకు గత సీజన్లోనే అనిపించింది. అప్పుడు నాతో మాట్లాడుతూ ‘‘నీతో కలిసి కాఫీ తాగాలి. చాలా మాట్లాడాలి’’ అని చెప్పేవాడు. నాకు ఏదోలా అనిపించి నేను కాఫీకి రానని చెప్పేశా. అప్పుడే తన విషయంలో ఏదో జరుగుతుందని గ్రహించా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అలాగే డివిలియర్స్ అంతకుముందెన్నడూ అలా మాట్లాడలేదని.. మాజీ సారథి వివరించాడు. ‘ఆ వాయిస్ మెసేజ్ వినగానే నేనూ భావోద్వేగానికి గురయ్యా. అతడితో ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకున్నాను. అయితే, మొన్ననే.. డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ.. ఇకపై మేం ఎప్పుడు కప్పు గెలిచినా.. మొదట తననే గుర్తుచేసుకోవాలనుకున్నా. బెంగళూరు కప్పు గెలవడం డివిలియర్స్కు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అతడో అద్భుతమైన వ్యక్తి. బెంగళూరు ఫ్రాంఛైజీలో ప్రతి ఒక్కరి మనసు తాకాడు’ అని కోహ్లీ అన్నాడు. ఇక తాను ఎప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతానని, ఎంత మంది ఆటగాళ్లు వచ్చిపోయినా ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తానని చెప్పాడు. ఇక్కడ లభించిన ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ తనతోనే ఉంటాయన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు