IND vs SA: బుమ్రాతో పెట్టుకుంటే అంతే.. జాన్సన్ వికెట్ ఎగిరిపోవడం చూశారా?
టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అది రెండో రోజు...
కేప్టౌన్: టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అది రెండో రోజు ఆటలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే, ఈసారి బుమ్రా ఆ సఫారీ ఆటగాడిపై ఆధిపత్యం సాధించడం విశేషం. జోహానెస్బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వీరిద్దరి మధ్య తొలిసారి మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో బుమ్రా బ్యాటింగ్ చేస్తుండగా జాన్సన్ బౌన్సర్లు సంధించాడు. ఈ క్రమంలో పలు బంతులను శరీరానికేసి విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే అంపైర్లు కలగజేసుకొని ఇద్దర్నీ దూరం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
ఇకపోతే తాజాగా మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్లో జాన్సన్ (7) ఔటయ్యాడు. టీమ్ఇండియా పేసర్ అతడికి ముందు పలు బౌన్సర్లు సంధించి ఉన్నట్టుండి ఒక బంతిని ఫుల్లెంగ్త్ డెలీవరిగా విసిరాడు. దీంతో ఆ బంతి వెళ్లి ఆఫ్స్టంప్ను బలంగా తాకడంతో వికెట్ గాల్లో ఎగిరి పడింది. అది చూసిన జాన్సన్ అవాక్కయ్యాడు. బుమ్రా ఎప్పటిలాగే మౌనంగా దక్షిణాఫ్రికా ఆటగాడి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇప్పుడీ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అభిమానులు దీన్ని రీట్వీట్ చేస్తూ రెండో టెస్టు నుంచే ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. బుమ్రాతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. టీమ్ఇండియా పేసర్ అతడిని ఎలా ఔట్ చేశాడో మీరూ చేసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్