IPL 2022: వినోదంలో మునిగి తేలిన ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లను చూడండి..!

ఈ వారంతంలో ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లూ తమ కొత్త, పాత ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయి...

Updated : 21 Mar 2022 15:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ వారంతంలో ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లూ తమ కొత్త, పాత ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్‌ సైతం తమ కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా గతరాత్రి ఆటగాళ్లకు ప్రత్యేక వినోదభరిత కార్యక్రమాలు నిర్వహించింది. ఇక్కడ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది సేద తీరడానికి పసందైన గేమ్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో సహా ప్రతిఒక్కరూ వీటిల్లో పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

కాగా, ముంబయి గతేడాది తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో ఈసారి మరో టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు 2013 నుంచి ఒక ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగు టైటిళ్లు సాధించిన రోహిత్‌ టీమ్‌ చివరిసారి 2019, 2020ల్లో విజేతగా నిలిచి ఆ పాత సంప్రదాయానికి తెరదించింది. ఇక గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగో సారి విజేతగా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ముంబయి రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని