Chess Olympiad: చదరంగం గడుల్లో మనుషులే పావులుగా.. అద్భుత వీడియో చూడండి..!
చదరంగం అనేది ఓ ప్రాచీన క్రీడ. పూర్వకాలంలో రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.. వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు...
ఇంటర్నెట్డెస్క్: చదరంగం ఓ ప్రాచీన క్రీడ. పూర్వం రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.. వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని వైపులా ఓ కన్నేసి ఉంచేవారు. దీంతో ఎత్తులు, పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను ఓడించేవారు. ఈ క్రమంలోనే ఆ ఎత్తులు, పై ఎత్తుల జిమ్మిక్కులతో చదరంగం పుట్టుకొచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అది క్రీడగా మారి అంతర్జాతీయ స్థాయిలో విశ్వవ్యాప్తమైందంటారు. యుద్ధభూమిలో సైనికులు, మంత్రులు, రాజులు ఎలా తలపడేవారో అచ్చం అలానే ఈ చదరంగంలోని గడుల్లో ఉండే పావులు ప్రత్యర్థులతో తలపడతాయి. ఆ అనుభూతిని కళ్లకు కట్టినట్లు చూపించారు తమిళనాడులోని పుదుకొట్టాయి జిల్లా కలెక్టర్ కవిత రాము. స్వతహాగా భరత నాట్య నృత్యకారిణి అయిన ఆమె ప్రస్తుతం జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్లో ఆరంభ వేడుకల్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తనదైన ముద్ర వేశారు.
తమిళనాడులో నిర్వహిస్తున్న ఈ చెస్ ఒలింపియాడ్ను ప్రజలకు చేరువ చేసేందుకు ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల పాలనాధికారులు ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పుదుకొట్టాయ్ జిల్లా కలెక్టర్ అందరికన్నా భిన్నంగా ఆలోచించారు. దాన్ని ఓ అద్భుత ప్రదర్శనగా తీర్చిదిద్దారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులను చదరంగంలోని పావులుగా మార్చి వారితో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఆటలో భాగమైనట్లు చూపించారు. ఒక చదరంగం బోర్డుపై నలుపు, తెలుపు రంగుల్లో కూచిపూడి, భరత నాట్యం, మార్షల్ ఆర్ట్స్, సిలంబం వంటి కళాకారులను ఉంచి వారితోనే గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, సైనికులు, రాజులు, మంత్రుల వంటి పాత్రలతో తలపడినట్లు కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్లో పంచుకోవడంతో అది ఇప్పుడు వైరల్గా మారింది. దానికి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన