Team India : జట్టు కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధమే.! : సూర్య కుమార్ యాదవ్
భారత జట్టు విజయం కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు...
ఇంటర్నెట్ డెస్క్ : భారత జట్టు విజయం కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచులో సూర్య కుమార్ (34: 36 బంతుల్లో 5×4) రాణించిన విషయం తెలిసిందే.
‘తొలి మ్యాచులో వికెట్ కాపాడుకుంటూ నిలకడగా ఆడాను. రెండో మ్యాచులో కూడా దాన్ని కొనసాగిస్తాను. క్రీజులో కుదురుకుని స్వేచ్ఛగా ఆడితే చాలు. పరుగులు వాటంతటా అవే వస్తాయి. జట్టు కోసం నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దమే. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం నాకేమీ కొత్త కాదు. జట్టు యాజమాన్యం ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా చేస్తాను. ఓపెనర్గా బరిలోకి దిగినా.. ఇలాగే ఆడతాను. భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు అవసరాలను బట్టి బౌలింగ్ చేసేందుకు కూడా నేను సిద్దమే. ఇప్పటికీ రెగ్యులర్గా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అవకాశం వస్తే కచ్చితంగా బౌలింగ్ చేస్తాను. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి రావడంతో మా జట్టు మరింత బలోపేతమైంది. అయితే, రెండో వన్డేలో ఎవరికి అవకాశమివ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే విషయంపై జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంటుంది. నన్ను సూర్యకుమార్లాగే ఉండనివ్వండి. వేరే వాళ్లతో పోల్చొద్దు. భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
సూర్యకుమార్ ఇప్పటి వరకు ఆడిన వన్డే, టీ20 మ్యాచుల్లో.. అవసరాన్ని బట్టి 3, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలోనూ అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?