కోహ్లీ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ : ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్
భారత సారథి విరాట్ కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కితాబిచ్చాడు. ‘కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే బౌలర్లు అతడిని త్వరగా ఔట్ చేయాలనే లక్ష్యంతో బంతులేస్తారు.
ఇంటర్నెట్ డెస్కు: భారత సారథి విరాట్ కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కితాబిచ్చాడు. ‘కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే బౌలర్లు అతడిని త్వరగా ఔట్ చేయాలనే లక్ష్యంతో బంతులేస్తారు. మేం సిరీస్ గెలవాలంటే ఇలాంటివి తప్పవు. ఇప్పటికి కూడా మేము కోహ్లీపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా ఔట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2018 పర్యటనలో కోహ్లీ 593 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే, ప్రస్తుత సిరీస్లో కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్లో కోహ్లీపై తీవ్ర ఒత్తిడి ఉంది. అవుట్ స్వింగ్ బంతులను అంచనా వేయడంలో విఫలమై వెనుదిరుగుతున్నాడు. బ్యాటింగ్ చేసేందుకు ఇదే సరైన పద్ధతి అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికీ తమదైన శైలి ఉంటుంది. పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో నిర్ణయించుకోవాలి. గత టెస్టులో మేం బాగా రాణించాం. ప్రత్యర్థికి ఎక్కువగా అవకాశాలివ్వలేదు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాం. లీడ్స్లో మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. తర్వాతి మ్యాచులో కూడా ఇదే ఫలితాన్ని ఆశిస్తున్నాం’ అని రూట్ అన్నాడు.
కోహ్లీ సేన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో కూడా పేలవ ప్రదర్శనను కొనసాగించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకున్నట్టు అనిపించినా.. అదెంతో సేపు నిలవలేదు. ఒక దశలో 237/3 పరుగులతో మెరుగ్గానే కనిపించినా.. తర్వాతి బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవడంతో 41 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాంగ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!