Chahal On Virat Kohli: సమస్యేంటంటే.. మనం కోహ్లీ సెంచరీల గురించే ఆలోచిస్తున్నాం..!
సుదీర్ఘకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్, కీలక బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
ఇంటర్నెట్డెస్క్: సుదీర్ఘకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్, కీలక బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తాజాగా స్పందించాడు. ఇటీవల కోహ్లీ ఎన్నో విలువైన నాక్స్తో జట్టుకు మంచి సహకారం అందించాడని చాహల్ అభిప్రాయపడ్డాడు. కానీ, చాలా మంది విరాట్ సెంచరీల గురించి ఆలోచించడం వల్లే ఈ సమస్యంతా వస్తోందని అన్నాడు.
తాజాగా ఓ క్రీడాఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన చాహల్.. కోహ్లీ ఆటతీరు గురించి స్పందించాడు. ‘‘ఓ ఆటగాడికి టీ20ల్లో 50 కంటే ఎక్కువ సగటు ఉన్నప్పుడు.. రెండు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైనప్పుడు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసినప్పుడు.. మనం అతడి సగటు రన్రేటు ఎలా ఉందనేది మాత్రమే చూడాలి. కానీ.. కోహ్లీ విషయంలో మనం కేవలం అతడి సెంచరీల గురించే ఆలోచిస్తుండటం వల్లే ఈ సమస్యంతా. ఈ మధ్యకాలంలో జట్టుకు అవసరమైనప్పుడు 60-70 పరుగులతో అనేక విలువైన నాక్లు ఆడి మంచి సహకారం అందించాడు. దాని గురించి మనం మాట్లాడట్లేదు’’ అని చాహల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ క్రీజులో పాతుకుపోతే బౌలింగ్ చేయడానికే చాలా మంది భయపడతారని చాహల్ ఈ సందర్భంగా అన్నాడు. ‘‘కోహ్లీ క్రీజులో ఉండి 15-20 పరుగులు చేసిన తర్వాత అతడికి బాల్ వేయడానికి ఏ బౌలర్ ఇష్టపడడు’’ అని చెప్పుకొచ్చాడు.
అనంతరం కెప్టెన్సీ మార్పు గురించి కూడా చాహల్ స్పందించాడు. కెప్టెన్ ఎవరైనా తన పాత్ర ఒకేలా ఉంటుందని అన్నాడు. ‘‘కెప్టెన్లు నన్ను ఒక వికెట్ తీసుకునే బౌలర్గానే ఉపయోగించుకుంటారు. అక్కడ ఎవరున్నా నాకు ఒకటే. బౌలర్గా నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పరిస్థితులను బట్టి అవసరమైతే బౌలర్ల సహకారం తీసుకుంటారు’’ అని తెలిపాడు.
కోహ్లీ బ్యాటింగ్పై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. 2019 నవంబరు తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్.. అర్ధసెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే చాహల్ స్పందించాడు. ఇక, కోహ్లీతో చాహల్కు మంచి అనుబంధం ఉంది. టీ20 మెగా లీగ్లోనూ బెంగళూరు జట్టుకు కోహ్లీ సారథిగా ఉన్నప్పుడు చాహల్ 8ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. త్వరలోనే వీరిద్దరూ ఆసియా కప్ 2022 టోర్నీలో మరోసారి కలిసి ఆడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక