IND vs NZ: తుది జట్టు ఎంపికలో గందరగోళం అవసరం లేదు.. జట్టుకే మొదటి ప్రాధాన్యమిస్తాం : కోహ్లి
ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై..
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై కోహ్లి స్పందిస్తూ.. రెండో టెస్టు కోసం తుది జట్టు ఎంపికలో గందరగోళం అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టుకే తొలి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నాడు. జట్టు అవసరాలను బట్టి యాజమాన్యం ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని చెప్పాడు.
‘సుదీర్ఘంగా సాగే టెస్టుల్లో రాణించాలంటే మంచి ఫామ్లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటవెంటనే విభిన్న ఫార్మాట్లలో ఆడాల్సి రావడంతో.. టెక్నిక్తో పాటు మానసికంగానూ అందుకు సిద్ధంగా ఉండాలి. వీలైనంత త్వరగా పిచ్ పరిస్థితులకు అలవాటు పడాలి. క్రీజులో నిలదొక్కుకోగలిగితే.. ఆటను బాగా అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా మేం తుది జట్టు కూర్పులో చాలా సార్లు మార్పులు చేశాం. జట్టుకు కావాల్సిందేంటో ఆటగాళ్లకు వివరించాం. మా ఆలోచనతో వారు కూడా ఏకీభవించారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఇదేమంత కష్టం కాదు. మా ప్రయాణంలో కూడా ఒడిదొడుకులు ఉండొచ్చు. అయినా, మనమంత ఆడుతున్నది ఒకే జట్టుకి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అలాగే, గత ఐదారు సంవత్సరాలుగా జట్టు కోసం ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉంటాం. భవిష్యత్లో కూడా దాన్ని కొనసాగిస్తాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. మెడనొప్పితో బాధపడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడని.. రెండో టెస్టుకి అతడు అందుబాటులోకి వస్తాడని కోహ్లి స్పష్టం చేశాడు. డిసెంబర్ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా