‘బాబర్ కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తాం..’: ముల్తాన్ టెస్టులో పాక్ అభిమానుల సందేశం
ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో పలువురు పాక్ అభిమానులు కింగ్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్ : ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్(England)తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ (pakistan)26 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచ్లో పలువురు పాక్ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వారు పాక్ ఆటగాళ్లకు కాకుండా..భారత క్రికెటర్ కింగ్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతు తెలపడం గమనార్హం. తమ కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam)కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పడం విశేషం. పాక్లోని కోహ్లీ అభిమానులు ఇలా తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఓ కారణముంది.. అదేంటంటే..?
పాక్లో వచ్చే ఏడాది నిర్వహించే ఆసియా కప్(Asia Cup 2023)పై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాక్లో భారత్ పర్యటించేది లేదని గతంలో బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. దీనిపై పీసీబీ చీఫ్ రమీజ్ రజా స్పందిస్తూ.. టీమ్ఇండియా(Team India) పాక్లో పర్యటించకపోతే.. వచ్చే ఏడాది భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్లో పాక్ ఆడబోదని హెచ్చరించాడు. ఆ తర్వాత ఇదే అంశంపై భారత క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ముల్తాన్ టెస్టు వేదికను పాక్లోని కోహ్లీ అభిమానులు ఉపయోగించుకున్నారు.
‘‘హాయ్.. కింగ్ కోహ్లీ.. పాక్ వచ్చి ఆసియా కప్ ఆడు’’, ‘‘మా కింగ్ బాబర్ కంటే మేం మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాం’’ అంటూ మ్యాచ్ మధ్యలో అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని