Tokyo Olympics: పారిస్ ఒలింపిక్స్లో 20కి పైగా పతకాలు సాధించడమే మా లక్ష్యం..!
2024లో నిర్వహించబోయే పారిస్ ఒలింపిక్స్లో 20-25 పతకాలు సాధించేందుకు ప్రయత్నిస్తామంటూ భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ధీమా వ్యక్తం చేశారు.
దిల్లీ: 2024లో నిర్వహించబోయే పారిస్ ఒలింపిక్స్లో 20-25 పతకాలు సాధించేందుకు ప్రయత్నిస్తామంటూ భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ధీమా వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో 7 పతకాలు సాధించి భారతీయ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఓ స్వర్ణం సహా రెండు రజతం, మూడు కాంస్య పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను పెంచారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే ప్రస్తుతం చాలా మంది క్రీడాకారులు తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగినట్టు భజరంగ్ పునియా తెలిపారు. ముందుగా ఆశించిన స్థాయిలో పతకాలు సాధించకున్నా.. గత ఒలింపిక్స్తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేశామన్నారు. రానున్న పారిస్ ఒలింపిక్స్లో మరింత మెరుగైన ప్రదర్శనతో భారత్కు పతకాల పంట పండిస్తామని పేర్కొన్నారు. మోకాలి గాయం కారణంగా అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయినట్టు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో శనివారం జరిగిన పురుషుల 65 కిలోల కుస్తీ పోటీల్లో భారతీయ స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్ పోటీల్లో కజక్స్థాన్కు చెందిన దౌలత్ నియజ్బెకోవ్ను 8-0తో చిత్తు చేసి రెజ్లింగ్లో ఒలింపిక్స్ పతకం సాధించిన ఆరో భారతీయ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్