‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
మొతేరా తరహా పొడి పిచ్లపై విజయవంతం అవ్వాలంటే బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు....
హైదరాబాద్: మొతేరా తరహా పొడి పిచ్లపై విజయవంతమవ్వాలంటే బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు. డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తికి గురిచేసిందని పేర్కొన్నాడు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో తలపడ్డ గులాబి పోరులో భారత్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు విపరీతంగా శ్రమించిన సంగతి తెలిసిందే. స్పిన్నర్ల బంతులను ఎదుర్కోలేక వారు త్వరగా బ్యాట్లెత్తేశారు. దాంతో ఇంగ్లాండ్ 112, 81 స్కోర్లకే పరిమితమవ్వగా టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
‘బ్యాటింగ్ చేసేటప్పుడు స్పైక్స్ ధరించాలన్న కనీస ఆలోచన అవసరం. రబ్బరు సోల్స్ బ్యాట్స్మెన్ సామర్థ్యాన్ని తగ్గించవు. రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించి కఠినమైన పిచ్లపై అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన బ్యాట్స్మెన్ను నేను చూశా. వికెట్ల మధ్య పరిగెడుతుంటే జారిపడతారన్న వాదనను నేను అంగీకరించను. ఎందుకంటే వింబుల్డన్లో టెన్నిక్ క్రీడాకారులంతా రబ్బరు సోల్స్ ఉన్న బూట్లనే ధరించి ఆడతారు. ఇంకా చెప్పాలంటే సునిల్ గావస్కర్, మొహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్సర్కారే వంటి భారతీయులే కాకుండా సర్ వివ్రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్ వంటి ఎంతోమంది నాకు గుర్తొస్తారు’ అని అజ్జూ అన్నాడు.
అహ్మదాబాద్ టెస్టులో బ్యాట్స్మెన్ వరుసపెట్టి పెవిలియన్ చేరడం నిరాశపరిచిందని అజహరుద్దీన్ అన్నాడు. పొడి పిచ్లు, స్పిన్ పిచ్లపై ఆడుతున్నప్పుడు ఫుట్వర్క్, షాట్ల ఎంపిక పక్కాగా ఉండాలని సూచించాడు. కాగా మొతేరా టెస్టులో రోహిత్, జాక్ క్రాలీ మాత్రమే అర్ధశతకాలు చేసిన సంగతి తెలిసిందే. చాలామంది స్పిన్ పిచ్ను విమర్శిస్తుండగా సునిల్ గావస్కర్ లాంటి వారు స్పిన్నర్ల సత్తాను ప్రశంసిస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM