Chennai vs Bangalore: చెన్నైతో పోరు.. కోహ్లీకి డుప్లెసిస్ సలహాలు..!
ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది...
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగింటిలో మూడు విజయాలతో దూసుకుపోతోంది. దీంతో మంగళవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు జట్ల బలాబలాలు చూస్తుంటే బెంగళూరు విజయానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
డుప్లెసిస్ కీలకం..
దశాబ్ద కాలం పాటు చెన్నై జట్టులో కీలక బ్యాట్స్మన్గా రాణించిన ఫా డుప్లెసిస్ ఈసారి మెగా వేలంలో బెంగళూరు గూటికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇక్కడ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడంతో ఆ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో బెంగళూరును నడిపిస్తున్నాడు. అయితే, డుప్లెసిస్కు సుదీర్ఘకాలం చెన్నైలో ఆడిన అనుభవం ఉండటంతో ప్రత్యర్థులపై ఆ జట్టు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే విషయాలపై కచ్చితమైన అవగాహన ఉండే అవకాశం ఉంది. దీంతో విరాట్ కోహ్లీని ఎలా నియంత్రించాలనేదానిపై చెన్నై ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్న విషయంపైనా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఎలాంటి సలహాలు ఇస్తాడనేది కీలకం కానుంది.
బెంగళూరు బ్యాట్స్మెన్ జోరు..
ఈ సీజన్లో బెంగళూరు బ్యాట్స్మెన్ అదరగొడుతున్నారు. ఒకరు కాకపోతే మరొకరు పరుగులు తీస్తున్నారు. టాప్ ఆర్డర్లో ఓపెనర్లు డుప్లెసిస్, అనూజ్ రావత్తో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీ రాణిస్తున్నారు. అలాగే గత మ్యాచ్లో గ్లెన్ మాక్స్వెల్ లాంటి హిట్టర్ కూడా అందుబాటులోకి రావడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. ఇక ఫినిషర్లుగా దినేశ్ కార్తీక్, వానిండు హసరంగ సైతం ధాటిగా ఆడుతున్నారు. దీంతో ఎలా చూసినా బెంగళూరు బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గా కనిపిస్తోంది. అదే సమయంలో చెన్నై బ్యాటింగ్ను పరిశీలిస్తే.. మిడిల్ ఆర్డర్లో శివమ్దూబె, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారు. టాప్ ఆర్డర్లో రుతురాజ్, రాబిన్ ఉతప్పతో పాటు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా సైతం విఫలమవుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం బెంగళూరు చెన్నైతో పోలిస్తే మంచి స్థితిలోనే ఉంది. హర్షల్ పటేల్, వానిండు హసరంగ రాణిస్తుండగా చెన్నైలో డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ఈరోజైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..