KL Rahul: ఆ ముగ్గురి కెప్టెన్సీలోనూ ఆడా.. ఎవరి నాయకత్వం ఎలా ఉంటుందంటే?: కేఎల్ రాహుల్
తొమ్మిదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన కేఎల్ రాహుల్ (KL Rahul) ముగ్గురి సారథ్యంలో ఆడాడు. వారి మధ్య తేడా ఏంటో అనేది అతడి మాటల్లోనే తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కాలికి గాయం కారణంగా ఐపీఎల్ (IPL 2023) సీజన్ నుంచి మధ్యలోనే వైదొలిగిన టీమ్ఇండియా ఆటగాడు, లఖ్నవూ సూపర్ జెయింట్స్ రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు తరఫున ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడటంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చాలా మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు రోహిత్ శర్మకి డిప్యూటీగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో వారి సారథ్యంలో ఆడటంపై కేఎల్ తన మనసులోని మాటను ఓ క్రీడా ఛానెల్ వేదికగా బయటపెట్టాడు.
ధోనీ నుంచి అదే నేర్చుకున్నా.. (MS Dhoni)
ముగ్గురు అద్భుతమైన సారథుల నాయకత్వంలో ఆడా. జాతీయ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ఎంఎస్ ధోనీ నా మొదటి కెప్టెన్. జట్టును చాలా నిశ్శబ్దంగా ఉంటూ ఎలా నడపాలనే విషయాలను ధోనీ నుంచి నేర్చుకున్నా. కేవలం మైదానంలోనే కాకుండా.. తెర వెనుక కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి ఆటగాడితో మంచి అనుబంధం ఎలా ఏర్పరుచుకోవాలో తెలిసింది. అప్పుడే సహచరులు మన కోసం పోరాడతారు. ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
విరాట్ సారథ్యంలో.. (Virat Kohli)
నా కెరీర్లో ఆరేడేళ్లు విరాట్ కెప్టెన్సీలోనే ఆడాను. గణాంకాల ప్రకారం అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఆట పట్ల అభిరుచి, దూకుడును విరాట్ తీసుకొచ్చాడు. మన జట్టు ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడు. ముందుండి మరీ టీమ్ను నడిపిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించడమెలాగో విరాట్ నుంచి నేర్చుకున్నా. అతడి నుంచి స్ఫూర్తి పొంది మరీ మా ఆటతీరును ఇంకాస్త మెరుగు పర్చుకున్నాం. ఓ సగటు ఆటగాడిగా మాత్రం ఉండిపోకుండా ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ.. వారిలోని సత్తాను వెలికి తీయడంలో విరాట్ది ప్రత్యేక శైలి.
పిచ్పై రోహిత్కు పూర్తి అవగాహన (Rohit Sharma)
ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం చాలా పదునుగా ఉంటుంది. అతడి వ్యూహాలు, మ్యాచ్కు ముందు చేసే హోంవర్క్ అద్భుతం. ప్రతి ఆటగాడి బలం ఏంటో తెలుసు. అతడేం చేయగలడు.. అతడిని ఎలా ఒత్తిడిలోకి నెట్టాలనే విషయాలపై అవగాహన ఉంటుంది. గేమ్ను ఎలా అర్థం చేసుకోవాలి.. దానికి తగ్గట్టు వ్యూహాలను ఎలా అమలు చేయాలనే విషయాలను రోహిత్ నుంచి నేర్చుకోగలిగా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.