Rohit Sharma : ఎందుకిలా హిట్మ్యాన్.. నాయకత్వ భారమా..? ఆటగాళ్ల వైఫల్యమా..?
టీ20 లీగ్ చరిత్రలో ఐదుసార్లు తన జట్టుకు కప్ అందించిన...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ చరిత్రలో ఐదుసార్లు తన జట్టుకు కప్ అందించిన సారథి అతడు... దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీకి సాధ్యం కాని రికార్డూ అతడి పేరిట సొంతం.. విరాట్ కోహ్లీ నుంచి నాయకత్వ పగ్గాలు అందుకుని మరీ టీమ్ఇండియానే అప్రతిహతంగా నడిపిస్తోన్న ఆ కెప్టెన్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ.. హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ.. అతని సారథ్యంలోని ముంబయి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ను గెలవలేకపోయింది. మరి ఎందుకిలా అవుతుందో ఓ సారి విశ్లేషిద్దాం..
భారత కెప్టెన్సీకి మార్గమదే..!
ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న రోహిత్ టీమ్ఇండియాకు సారథిగా ఎంపిక కావడానికి ప్రధానం కారణం.. ముంబయి కెప్టెన్గా విజయవంతం కావడమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్గా నిలపడం సాధారణ విషయమేమీ కాదు. తీవ్ర పోటీ ఉండే టీ20 లీగ్లో ఆ ఫీట్ను సాధించడమే రోహిత్ శర్మకు ప్లస్ అయింది. విరాట్ కంటే ముందే భారత జట్టు నాయకత్వ బాధ్యతలు అందుకునే అవకాశం రోహితుడికే దక్కాల్సింది. అయితే దూకుడు, భీకర ఫామ్లో ఉండటం విరాట్ కోహ్లీకి కలిసొచ్చి కెప్టెన్సీ వరించింది. అయితే విరాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ మరే ఇతర ఆటగాళ్ల గురించి ఆలోచించకుండా రోహిత్కే అన్ని ఫార్మాట్ల పగ్గాలను అందించింది. వయసురీత్యా రోహిత్ (34) ఇంకో నాలుగైదేళ్లు మాత్రమే ఆడగలడు. అయినా కెప్టెన్గా నియమించిందంటే రోహిత్పై ఉండే నమ్మకం ఇది.
నాయకత్వమే భారమా..? వారి వైఫల్యమా?
భారత్ క్రికెట్ జట్టు సారథిగా ఎంపికైన తర్వాత ఆడిన ప్రతి సిరీస్నూ రోహిత్ టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహకారంతో సొంతం చేసుకుంటూనే వచ్చాడు. న్యూజిలాండ్, లంక, విండీస్ జట్ల మీద టీ20 సిరీస్లను నెగ్గాడు. నూతన సమరోత్సాహంతో టీ20 లీగ్లోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లను ఆడిన ముంబయి ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది. బోణీ కొట్టలేకపోయింది. వ్యూహాలను అమలు చేయడంలో రోహిత్ విఫలమవుతున్నాడా..?అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత సీజన్ వరకు ముంబయి జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్లో సహకారం లేదు.
బయటపడేదెలా..?
ముంబయి జట్టు యాజమాన్యం సభ్యులకు ఎంతో స్వేచ్ఛనిస్తుంది. గత సీజన్ వరకూ వారు రాణించడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సారి యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలర్లు తేలిపోతున్నారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్కే అందుబాటులో ఉండడు. బుమ్రాకు తోడుగా బసిల్ థంపి, జయ్దేవ్ ఉనద్కత్ వంటి ఫాస్ట్ బౌలర్లను ప్రయోగించినా వర్కౌట్ కాలేదు. మిల్స్, డానియల్ సామ్స్ వంటి విదేశీ బౌలర్లూ తేలిపోయారు. కాబట్టి బౌలింగ్పై భారం లేకుండా ఉండాలంటే బ్యాటింగ్లో భారీ స్కోర్లు చేయాలి. పిచ్ను బట్టి ఒక్కోసారి వాటిని కాపాడుకోవడం కూడా కష్టమే అవుతుందేమో కానీ.. ప్రయత్నించడానికి బౌలర్లకు అవకాశం దొరుకుతుంది. యువ క్రికెటర్లను సమతుల్యం చేసుకుని నడిపించాల్సిన బాధ్యత రోహిత్పై ఉంది. ఇక నుంచైనా విజయాల బాట పట్టాలని ముంబయి అభిమానులు కోరుతున్నారు.
రోహిత్ ఫామ్లోకి రావాలి
ఓపెనింగ్లో శుభారంభం దక్కితే కింద వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఓ వైపు ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. రోహిత్ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కలిపి (41, 10, 3, 26, 28) 108 పరుగులు మాత్రమే చేశాడు. వీటిల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలయిస్తూ ఒక్క ఇన్నింగ్స్ లేకపోవడం గమనార్హం. ఇక నుంచైనా నాయకుడిగానే కాకుండా కీలక బ్యాటర్గా భారీ స్కోర్లు చేసి నడిపిస్తేనే ముంబయికి విజయాలు దక్కేది. లేకపోతే అత్యంత చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ