WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
WTC Finalకు రంగం సిద్ధమైంది. ఒకవేళ ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే, మ్యాచ్ డ్రా అయితే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు క్రికెట్లో ప్రతిష్ఠాత్మక మహా సమరానికి (WTC Final) వేళైంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న WTC Final కోసం దిగ్గజ జట్లు భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) సిద్ధమయ్యాయి. గత సీజన్లో ఫైనల్ వరకూ వెళ్లిన టీమ్ఇండియా.. ఈ సారి టైటిల్ గెలిచి.. భారత్కు ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఐదు రోజుల పాటు జరిగే ఈ టెస్టు మ్యాచ్లో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. వర్షం వల్ల ఆట ఆగిపోతే.. పరిస్థితి ఏంటి? ఐసీసీ నిబంధనలు ఎలా ఉన్నాయి..?
- ఐదు రోజుల ఆటలో వర్షం వల్ల ఎక్కువ సమయం నష్టపోతే.. లేదా ఒక రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోయినా ఆట ఆరో రోజైన రిజర్వ్డే (Reserve Day)కు వెళ్తుంది. ఈ ఫైనల్కు ఐసీసీ రిజర్వ్డేను కేటాయించిన విషయం తెలిసిందే.
- రిజర్వ్డే రోజూ ఆట సవ్యంగా సాగకపోయి.. మ్యాచ్ డ్రా అయితే.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
- ఒకవేళ ఐదు రోజుల్లోనే మ్యాచ్ డ్రా (Draw)గా ముగిస్తే.. భారత్, ఆస్ట్రేలియాను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
- మ్యాచ్ టైగా ముగిసినా.. ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.
ఇతర ఈవెంట్లలో అయితే.. ఇలాంటి సందర్భాల్లో బౌండరీ కౌంట్లు, సూపర్ ఓవర్లు, లీగ్ దశలో వారి ప్రదర్శన లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇలా ఉండదు.
వర్షం అంతరాయం కలిగిస్తేనే రిజర్వ్ డే (Reserve Day)..
మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించినప్పుడు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ సమయాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మ్యాచ్ రిజర్వ్డేకు వెళ్తుంది. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి, మ్యాచ్ విజేతను తేల్చేందుకు రిజర్వ్డేను ఉపయోగిస్తారు. వర్షం పడకపోతే.. మ్యాచ్ ఐదు రోజుల్లోనే ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు