MS Dhoni: ప్రపంచ కప్లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) మొదలవ్వబోతోంది. దీంతో భారత్కు రెండో ప్రపంచకప్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
జులపాల కుర్రాడిగా అడుగుపెట్టి.. అద్భుతమైన బ్యాటింగ్తో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగి.. అసాధారణమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో అదరగొట్టి.. నాయకుడిగా జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించి.. దిగ్గజంగా మారిన ఆ ఆటగాడు లేకుండా 16 ఏళ్లలో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఆడుతోంది. ఆ ఆటగాడే మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni). ప్రపంచ క్రికెట్లో అతని ముద్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2011 ప్రపంచకప్లో సారథిగా భారత్ను విజేతగా నిలిపిన మాహీ.. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ల్లో ధోని ప్రదర్శన.. ప్రస్తుత జట్టులో అతని లోటు తదితర విషయాల గురించి ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
ఆటగాడిగానే..
ధోని తన వన్డే ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆటగాడిగానే మొదలెట్టి.. ఆటగాడిగానే ముగించాడు. 2007 ప్రపంచకప్లో జులపాల జట్టుతో యువ ఆటగాడిగా ధోని తొలిసారి ఈ వన్డే విశ్వ సమరంలో భాగమయ్యాడు. అతని షాట్లు.. దూకుడైన ఆటతీరు.. తనదైన శైలి సిక్సర్లు.. ఇలా ఆ ప్రపంచకప్తో ధోని ప్రపంచానికి పరిచయమయ్యాడనే చెప్పాలి. కానీ ఆ టోర్నీలో మూడు మ్యాచ్లే ఆడే అవకాశం దక్కించుకున్న ధోని 29 పరుగులే చేశాడు. కానీ అప్పుడే అతని అద్భుతమైన ప్రపంచకప్ కెరీర్కు తొలి అడుగు పడింది. ఆ తర్వాత నాలుగేళ్లలో అతని కెరీర్ రాకెట్ స్పీడ్తో సాగింది. 2011 ప్రపంచకప్ వచ్చేనాటికి నాయకుడిగా జట్టును గొప్పగా నడిపించే స్థాయికి చేరుకున్నాడు. సారథ్యంతో పాటు బ్యాటింగ్లోనూ ఆ కప్పులో అదరగొట్టి విశ్వరూపం ప్రదర్శించాడు.
మాహీ 8 ఇన్నింగ్స్ల్లో 241 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో శ్రీలంకపై 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చి.. బ్యాట్ను తిప్పి.. 28 ఏళ్ల తర్వాత దేశానికి ప్రపంచకప్ అందించిన ఆ క్షణాలను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2015లో మరోసారి భారీ అంచనాలతో ప్రపంచకప్లో అడుగుపెట్టిన టీమ్ఇండియా సెమీస్లో నిష్క్రమించింది. ఆ టోర్నీలో 6 ఇన్నింగ్స్లో 59.25 సగటుతో 237 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్లో ఆటగాడిగా కోహ్లి సారథ్యంలో ఆడాడు ధోని. ఈ సారి 9 మ్యాచ్ల్లో 273 పరుగులు సాధించాడు. సెమీస్లో కివీస్పై అర్ధశతకంతో జట్టును గెలిపించేందుకు పోరాడాడు. కానీ అతని రనౌట్ జట్టుతో పాటు దేశాన్ని ఆవేదనలో ముంచెత్తింది.
అతను లేని లోటు..
ఇప్పుడు ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం పంత్ దూరమవడంతో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడ్డారు. చివరకు కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులోకి వచ్చాడు. ప్రత్యామ్నాయంగా ఇషాన్ను ఎంపిక చేశారు. ఇప్పుడంటే పరిస్థితి ఇలా ఉంది కానీ 2020 ఆగస్టు 15 కంటే ముందే జట్టులో ఒక్కరే వికెట్ కీపర్... అతనే ధోని. ఈ విషయంలో మరో మాటే లేదు. జట్టులోకి వచ్చినప్పటి నుంచి ధోనీనే వికెట్ కీపర్. వికెట్ల వెనుకాల అతని ప్రదర్శన అలాంటిది మరి. అందుకే వరుసగా నాలుగు వన్డే ప్రపంచకప్ల్లోనూ ధోనీకి తిరుగులేకుండా పోయింది. 25 ఇన్నింగ్స్ల్లో 42 ఔట్లలో పాలుపంచుకున్నాడు.
మరోవైపు బ్యాటింగ్లో రాణించిన ధోనీ 29 మ్యాచ్ల్లో 780 పరుగులు చేశాడు. ఇక సారథిగా ధోని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అందరికీ తెలిసినవే. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయాల దిశగా నడిపించడంలో అతణ్ని మించిన వాళ్లు లేరనే చెప్పాలి. మ్యాచ్లో ప్రణాళికలు, పరిస్థితులను బట్టి వ్యూహాలు అమలు చేయడంలో ధోని దిట్ట. ఇప్పుడు మరోసారి భారత్లో జరగబోతున్న ప్రపంచకప్లో టీమ్ఇండియా ఫేవరేట్గా బరిలో దిగుతోంది. మరి 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో ధోని జట్టును విజేతగా నిలిపాడు. మరి ఈ సారి పూర్తిగా స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్లో రోహిత్ సేన విశ్వవిజేతగా నిలుస్తుందేమో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: ఐపీఎల్కు ‘షెడ్యూల్’ సమస్య.. ఈసీ నిర్ణయం తర్వాత తేదీల ప్రకటన
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్.. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆధారపడింది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాతే.. ఐపీఎల్ టోర్నీ తేదీలు వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ODI WC 2023: వరల్డ్ కప్పై కాళ్లు.. నేనెక్కడా అగౌరవపర్చలేదు: మిచెల్ మార్ష్
వన్డే ప్రపంచకప్ను (ODI World Cup 2023) నెగ్గాక ఆ ట్రోఫీపై కాళ్లు పెట్టి విమర్శలపాలైన మిచెల్ మార్ష్ ఎట్టకేలకు ఆ సంఘటనపై స్పందించాడు. -
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
IND vs AUS: భారత్-ఆసీస్ నాలుగో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాయ్పుర్ మైదానానికి కరెంట్ సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్నేళ్లుగా విద్యుత్ సరఫరా లేదట. దీంతో మ్యాచ్ నిర్వహణకు జనరేటర్లే ఆధారంగా మారాయి. -
Ravichandran Ashwin: నేనెప్పటికీ విరాట్ కోహ్లీ కాలేను: అశ్విన్
Ravichandran Ashwin: తాను ఎంత కష్టపడినా ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ (Virat ) స్థాయిని అందుకోలేనని అంటున్నాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. ఓ క్రీడాఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన కెరీర్ గురించిన విషయాలను పంచుకున్నాడు. -
Irfan Pathan: ఉమ్రాన్ విషయంలో నా అంచనాలు తప్పాయి: ఇర్ఫాన్ పఠాన్
దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడేందుకు భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్శర్మ డ్రెస్సింగ్రూమ్లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో బ్యాటర్గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Maharashtra: అజిత్ పవార్కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
-
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
-
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి
-
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
-
Review Calling Sahasra: రివ్యూ: కాలింగ్ సహస్ర.. సుధీర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?
-
Electricity bill: రూ.4,950 బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు