Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మధ్య జరిగిన సరదా సన్నివేశాన్ని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ సంఘటన మూలంగా సచిన్ కాళ్ల మీద పడి మరీ అక్తర్ క్షమాపణలు కోరినట్లు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) కాళ్ల మీద పడి మరీ క్షమించమని అడిగాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar). కానీ ఇది జరిగింది ఇప్పుడు కాదు దిగ్గజ క్రికెటర్లిద్దరూ గొప్పగా రాణిస్తున్న రోజుల్లో.. ఈ విషయాన్ని స్వయంగా భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వెల్లడించాడు. ఇంతకీ విషయమేమిటంటే..?
సచిన్ తెందుల్కర్, షోయబ్ అక్తర్ మధ్య జరిగిన ఓ సరదా సంఘటనను వీరూ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేస్తుకున్నాడు. దాని గురించి ఎప్పుడు ప్రస్తావించినా భారత క్రికెటర్లు నవ్వకుండా ఉండలేరన్నాడు. తెందుల్కర్ను అక్తర్ తన భుజాలపై ఎత్తుకోవడానికి ప్రయత్నించి విఫలమవడంతో వారిద్దరూ కింద పడిపోయినట్లు తెలిపాడు. అతడు భారతీయుల ఆశల్ని తన భుజాలపై మోస్తున్నాడు..అందుకే అంత బరువున్నాడని సచిన్ను చమత్కరించినట్లు చెప్పాడు. ‘‘ఓసారీ లఖనవూలో భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల మధ్య పార్టీ జరిగింది. అప్పుడు అక్తర్ చాలా తాగాడు. సచిన్ను ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతడు చాలా బరువు ఉండటంతో తనని ఎత్తడం అక్తర్ వల్ల కాలేదు. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అప్పుడు నేను నవ్వకుండా ఉండలేకపోయాను’’ అని వీరూ తెలిపాడు.
‘‘ఈ ఘటనతో అక్తర్ చాలా ఇబ్బందిపడ్డాడు. తనని నేను చాలా ఆటపట్టించాను. నీ పని అయిపోయింది. ఇక నీ కెరీర్ ప్రశ్నార్థకమే? నువ్వు మా జట్టులో గొప్ప ఆటగాడిని కింద పడేశావు అంటూ భయపెట్టాను. నా మాటలకు అతడు చాలా భయపడ్డాడు. సచిన్ ఎక్కడ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తాడోనని భయపడి తనకు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ ఎక్కడ కనిపించినా తనను అనుసరిస్తూ క్షమాపణలు చెప్పేవాడు. ఓరోజు ఏకంగా తన కాళ్లమీద పడిపోయాడు. నేను సచిన్ ఎప్పుడు కలిసినా ఈ సంఘటనను గుర్తు చేసుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం’’ అని సెహ్వాగ్ వివరించాడు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య శత్రుత్వం కేవలం మైదానం వరకే పరిమితమవుతుందని అతడు పేర్కొన్నాడు. ఇరుజట్లు బయట కలుసుకున్నప్పుడు పరస్పరం ఆతిథ్యమిచ్చుకుంటాయని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్