IPL Playoffs: లఖ్నవూ గెలుపు.. ఇతర జట్లపై ప్రభావమెంతంటే..?
ఐపీఎల్(IPL 2023) ప్లేఆఫ్స్ రేసు(Playoffs Race) కొనసాగుతోంది. ప్రస్తుత తరుణంలో ఒక జట్టు ఓడినా.. గెలిచినా ఆ ప్రభావం ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL 2023)లో ప్లేఆఫ్స్ రేసు హోరాహోరీగా కొనసాగుతోంది. ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లోకి చేరిన తొలి జట్టుగా గుజరాత్(Gujarat Titans) నిలవగా.. మిగతా మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది. ఇక మంగళవారం కీలక మ్యాచ్లో ముంబయి(Mumbai Indians)పై లఖ్నవూ(Lucknow Super Giants) అనూహ్య విజయాన్ని నమోదు చేయడంతో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ ఫలితంతో లఖ్నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. అదే సమయంలో ఇతర జట్లపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తే..
చెన్నై(chennai super kings) : ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న చెన్నై ఆఖరి మ్యాచ్లో దిల్లీపై గెలిస్తే.. టాప్ 2లోనే నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ చెన్నై ఓడి.. తమ చివరి మ్యాచుల్లో లఖ్నవూ, ముంబయి, బెంగళూరు గెలిస్తే.. అప్పుడు సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి.
ముంబయి(Mumbai Indians) : లఖ్నవూపై ఓటమితో ముంబయి ఇండియన్స్ తన చివరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు ముంబయి 16 పాయింట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో.. బెంగళూరు, పంజాబ్ కూడా తమ తదుపరి మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటాయి. ఈ జట్ల మధ్య పోటీ నెలకొననుంది. ఆఖరి గేమ్లో ఓడిపోతే మాత్రం ముంబయికి అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి.
బెంగళూరు(Royal Challengers Bangalore) : ఈ జట్టుకు ఉన్న ఏకైక సానుకూలంశం పాజిటివ్ రన్ రేట్. రాజస్థాన్పై భారీ విజయమే ఇందుకు కారణం. అయితే తదుపరి రెండు మ్యాచ్ల్లో తప్పక నెగ్గడంతోపాటు ఇతర జట్ల ఫలితాలు తనకు సానుకూలంగా ఉండాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో బెంగళూరు కొనసాగుతోంది.
పంజాబ్(Punjab Kings) : పంజాబ్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. తదుపరి రెండు మ్యాచ్ల్లో భారీ రన్రేట్తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాలి. మైనస్ నెట్రన్రేట్ ఈ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక నేడు దిల్లీతో జరిగే మ్యాచ్లో పంజాబ్ ఓడిపోతే.. ప్లేఆఫ్స్ అవకాశాలు లేనట్లే.
ఇక ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్న రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే తదుపరి పంజాబ్తో జరిగే మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. మరోవైపు ముంబయి, బెంగళూరు తర్వాతి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. కోల్కతా ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్, దిల్లీ వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.