Sourav Ganguly: అది నిజమే.. ఏడుగురు కెప్టెన్సీ చేయడం సరికాదు: గంగూలీ
టీమ్ఇండియాలో కొద్దినెలలుగా ఏడుగురు కెప్టెన్లు మారడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాలో కొద్దినెలలుగా ఏడుగురు కెప్టెన్లు మారడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా భారత జట్టులో ఇటీవల తరచూ కెప్టెన్లు మారడంపై ప్రశ్నించగా.. ఇలా సమాధానమిచ్చాడు.
‘ఇంత స్వల్ప కాలంలో ఏడుగురు కెప్టెన్లు మారడం అనేది నిజంగా మంచిది కాదు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తా. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. గతేడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ టీమ్ఇండియాను నడిపించాల్సింది. కానీ, సరిగ్గా టోర్నీ ప్రారంభానికి ముందు అతడు గాయపడ్డాడు. దాంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా ఇటీవల భారత్కు వచ్చినప్పుడు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దాంతో పంత్కు కెప్టెన్సీ వచ్చింది. అలాగే ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడుతుంటే రోహిత్ కరోనా బారినపడ్డాడు. ఇందులో ఎవరి తప్పూ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, మధ్యలో గాయాలు, ఆటగాళ్ల పనిభారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నడిపించాల్సి ఉంది. ఈ విషయంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను చూసి జాలిపడాలి’ అని గంగూలీ వివరించాడు.
ప్రశ్న: భారత టీ20 లీగ్లో ఇప్పుడు పది జట్లు ఉన్నాయి. భవిష్యత్లో బీసీసీఐ ఆదాయం రూ.60 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్ల సంఖ్య కూడా పెరిగేకొద్దీ ప్రతిభావంతులైన క్రికెటర్లు విషయంలో రాజీ పడవచ్చని మీరు భయపడుతున్నారా?
గంగూలీ: అలా ఏం ఉండదు. సమయం గడిచేకొద్దీ భారత్లో ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. మన దేశంలో ఎంత మంది ప్రతిభావంతులు ఉన్నారో ఈ టీ20 లీగ్ నిరూపిస్తోంది. ఇప్పుడున్న టీమ్ఇండియాను చూడండి. అటు టెస్టు క్రికెట్లో ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారో చూడండి.
ప్రశ్న: బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక్కడ ఎలా ఉంది? ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పండి.
గంగూలీ: 2019లో బీసీసీఐ సభ్యుల మద్దతుతో నేను ఈ పదవిలోకి వచ్చాను. ఇదో అద్భుత ప్రయాణం. భారత క్రికెట్ రూపురేఖలు మార్చే గొప్ప అవకాశం ఇది. గడిచిన రెండేళ్లలో కొవిడ్-19 కాలం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఆ సమయంలో భారత టీ20 లీగ్తో పాటు దేశవాళీ క్రికెట్నూ నిర్వహించాం. నేను ఈ పదవిలోకి రాకముందే పాలనా విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉంది. క్యాబ్ జాయింట్ సెక్రటరీగా, అధ్యక్షుడిగా మంచి అవగాహన ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు