Virat Kohli: కెప్టెన్సీ వదులుకున్న విరాట్… విశ్వరూపం చూపిస్తాడా?
బ్యాటింగ్ అంటే చాలు… విరాట్ కోహ్లీకి పూనకం వచ్చేస్తుంటుంది. వందల కొద్దీ పరుగులు అలవోకగా చేసేస్తూ ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో అలనాటి విరాట్ను మళ్లీ చూస్తామా..
బ్యాటింగ్ అంటే చాలు… విరాట్ కోహ్లీకి పూనకం వచ్చేస్తుంటుంది. వందల కొద్దీ పరుగులు అలవోకగా చేసేస్తూ ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు.. దేశవాళీ టీ20 లీగుల్లోనూ రికార్డులే. అందుకే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (6,283 పరుగులు) ఇతడే. అయితే.. ఇటీవల విరాట్ బ్యాటింగ్లో మునుపటి దూకుడు లేదు, పరుగులూ లేవు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆనాటి కోహ్లీని చూపిస్తా అని కూడా అన్నాడు. మరి ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో మనకు పాత కోహ్లీ కనిపిస్తాడా? పరుగుల వరద పారిస్తాడా!
కోహ్లీ ఏం ఓవర్నైట్ స్టార్ అయిపోలేదు. 2008లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తొలి సీజన్లలో పెద్దగా రాణించింది లేదు. తొలి సీజన్ (2008)లో 12 ఇన్నింగ్స్లు ఆడి 165 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఏడాదిలో 246 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక 2010లో 307 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 2011లో అయితే 557 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకేశాడు. 2012కి వచ్చేసరికి కోహ్లీ కాస్త నెమ్మదించాడు. 364 పరుగులతో 16వ స్థానానికి పడిపోయాడు.
కింద పడితే అంతే వేగంగా పైకి లేచే గుణం ఉన్న కోహ్లీ.. 2013 టోర్నీలో అదరగొట్టాడు. దానికి తోడు కెప్టెన్గా ఆ ఏడాదే బెంగళూరు పగ్గాలు అందుకున్నాడు. దీంతో 634 పరుగులతో టోర్నీలో మూడో టాప్ స్కోరర్ అయ్యాడు. ఆ తర్వాతి ఏడాది (2014) అంతగా కలసి రాలేదు. 2015లో మరోసారి బ్యాట్ ఝళిపించాడు. 505 పరుగులతో అదరగొట్టాడు. అసలు సిసలు బ్యాటింగ్ సత్తా చూపించిన ఏడాది అంటే 2016. ఏకంగా 16 మ్యాచుల్లో 973 పరుగులు చేసి రికార్డు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సంపాదించాడు.
ఇక 2017లో కోహ్లీ సిరీస్ మధ్యలో గాయం కారణంగా వైదొలిగాడు. అయినా 10 మ్యాచ్ల్లో 308 పరుగులు చేశాడు. ఇక 2018లో బెంగళూరు.. ఈ పరుగుల యంత్రాన్ని రూ. 17 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. ఆ ఏడాది 530 పరుగులు చేశాడు. 2019లో కోహ్లీ బ్యాటు నుంచి మంచి పరుగులే వచ్చాయి. 14 మ్యాచ్ల్లో 464 పరుగులు చేశాడు. కానీ ఏడుగురు బ్యాటర్లు అతడిని దాటి వెళ్లిపోయారు. దీంతో కింగ్ కోహ్లీ వెనుకబడ్డాడు. 2020లోనూ ఇదే పరిస్థితి. 466 పరుగులతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక 2021లో అయితే కోహ్లీ నెం 12. 405 పరుగులు చేసినా సరిపోలేదు.
పై లెక్కలన్నింటినీ క్రోడీకరించి చెప్పాలంటే 2019 నుంచి విరాట్ బ్యాటింగ్ ప్రదర్శన తగ్గుతూ వస్తోంది. 400 పరుగుల మార్కు దాటుతున్నా… ఇప్పటి వేగానికి సరిపోవడం లేదు. కొత్త కుర్రాళ్లు అర్ధ సెంచరీలు, సెంచరీలు అంటూ దూసుకుపోతున్నారు. కోహ్లీ ఆ స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ లెక్కలు చూసుకున్నాడో, లేక ఎంత ఆడినా కప్ రావడం లేదు అనుకున్నాడో ఏమో.. కెప్టెన్సీ వదిలేశాడు. కేవలం బ్యాటర్గా 2022 ఐపీఎల్లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో 2016 నాటి కోహ్లీ కావాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు.
వందల పరుగులు సునాయాసంగా చేసి ఇప్పటికీ కింగే అని అనిపించుకోవాలని ఆశిస్తున్నాడు. నిజానికి ఇదేమంత సులభమైన విషయం కాదు. 2016 అంటే ఆరేళ్ల క్రితం. అప్పటికి విరాట్ వయసు 27 మాత్రమే. అప్పుడు బ్యాటింగ్లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించాలి. ఫిట్నెస్ విషయంలో ఇప్పటికీ వేలెత్తి చూపే ప్రశక్తే లేదు. కానీ ఫామ్ కూడా చాలా అవసరం. రీసెంట్గా కోహ్లీ ఫామ్ ఏమంత బాగో లేదు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా కెప్టెన్సీ వదిలేశాడు. అక్కడ కూడా బ్యాటింగ్ ప్రదర్శనే కారణం అని చెప్పాడు. కానీ బ్యాటింగ్లో పెద్దగా మార్పేమీ రాలేదు.
రీసెంట్ ఫామ్ చూస్తే వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో చేసిన 52 పరుగులే అత్యధికం. ఇక విండీస్తో జరిగిన రీసెంట్ రెండో టెస్టులో 23, 13 పరుగులే చేశాడు. తొలి టెస్టు 45 పరుగులు చేయడం కాస్త ఉపశమనం. అయితే ఇదే ఫామ్ను కొనసాగిస్తే 2016 నాటి కోహ్లీని మనం చూడలేం. గత ఫామ్ను మరచి, కొత్తగా తనను తాను మార్చుకుంటే విరాట్ విశ్వరూపం చూడొచ్చు. ఈ నెల 27న పంజాబ్తో జరగబోయే తొలి మ్యాచ్లోనే కింగ్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ అనుకోవాలంటే… బ్యాటు ఝుళిపించాల్సిందే.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్