Virat Kohli: ఆ సమయంలో ధోనీ ఒక్కడే మెసేజ్ చేశాడు: కోహ్లీ
టీవీల ఎదుట కూర్చోని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనని టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. నిన్న ఆసియాకప్లో భారత్-పాక్ మ్యాచ్
ఇంటర్నెట్డెస్క్: టీవీల ఎదుట కూర్చొని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనని టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. నిన్న ఆసియాకప్లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్కాన్ఫరెన్స్లో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు ధోనితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో మరోసారి వివరించాడు. విమర్శకులకు దీటుగా సమాధానమిచ్చాడు.
ధోనీతో అనుబంధం గురించి కోహ్లీ మాట్లాడుతూ ‘‘నేను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. గతంలో నేను అతడితో కలిసి ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్లు చేయలేదు. నా ఫోన్నంబర్ చాలా మంది వద్ద ఉంది. చాలా మంది నాకు టీవీల్లో సలహాలు ఇస్తున్నారు. కానీ, ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. మీకు ఇరువైపుల నుంచి నమ్మకముందన్న విషయం అర్థమవుతుంది. నేను అతడి నుంచి ఏమీ ఆశించలేదు.. అతడు నా నుంచి ఏమీ ఆశించలేదు. మేము ఇద్దరం పరస్పరం అభద్రతా భావంతో ఎప్పుడూ లేము’’ అని అన్నాడు.
టీవీల్లో బహిరంగ సలహాలు ఇవ్వడంపై మాట్లాడుతూ.. ‘‘నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే.. వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీల ఎదుట లేదంటే ప్రపంచం మొత్తానికి తెలిసేట్లు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే.. వాటికి నా వద్ద ఎలాంటి విలువ ఉండదు. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తాను. అవి ఎలా ఉంటాయో మీరే చూస్తారు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు.. మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి’’ అని కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు.
తప్పులు ఎవరైనా చేస్తారు..
అర్ష్దీప్ సింగ్ కీలక సమయంలో క్యాచ్ను వదిలేయడంపై కోహ్లీ స్పందించాడు. ఈ విషయంలో అర్ష్దీప్ను పూర్తిగా వెనకేసుకొచ్చాడు. ‘‘ఎవరైనా తప్పులు చేస్తారు. అక్కడ పరిస్థితి చాలా ఉత్కంఠగా ఉంది. మ్యాచ్ చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పులు జరగొచ్చు. నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు షాహిద్ అఫ్రిదీ బౌలింగ్లో చెత్తషాట్ ఆడాను. ఆ రోజు నిద్రపట్టక తెల్లవారు జాము 5 గంటల వరకూ సీలింగ్ చూస్తూనే గడిపాను. నా కెరీర్ ముగిసిపోయిందనుకొన్నాను. ఇవన్నీ సహజమే. ప్రస్తుతం టీమ్ ఇండియాలో మంచి వాతావరణం ఉంది. సీనియర్లు మీ చుట్టూ ఉంటారు. ఈ క్రెడిట్ కెప్టెన్, కోచ్కే దక్కుతుంది. తప్పును గ్రహించి.. దాని నుంచి నేర్చుకొని ముందుకు వెళ్లడమే’’ అని విరాట్ చెప్పారు.
హార్దిక్, సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాళ్లు..
పాక్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్, సూర్యకుమార్ పెద్దగా ప్రభావం చూపంచకపోవడంపై కోహ్లీ మాట్లాడుతూ..‘‘హార్దిక్, సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాళ్లు. లీగ్ సిరీస్ నుంచి హార్దిక్ తన శక్తిసామర్థ్యాలను తెలుసుకొన్నాడు. నాటి నుంచి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొన్నాడు. చాలా బాధ్యతాయుతమైన ఆటగాడు. నేను అదే గమనించాను. ఆల్రౌండర్గా అతడి బాధ్యత ఏమిటో తెలుసుకొన్నాడు. అతడు అంతగా శ్రమించడం నేను ఎన్నడూ చూడలేదు. ఈ రకంగా ఆడటం, బౌలింగ్ ఫిట్నెస్ సాధించడం చాలా పెద్ద విషయం. సూర్యకుమార్లా ఆడే ఆటగాడు ప్రపంచంలో మరొకరు ఉంటారని అనుకోను. ఒక్కసారి అతడు ఆడటం మొదలుపెడితే.. ప్రత్యర్థుల నుంచి మ్యాచ్ను అలవోకగా లాగేసుకొంటాడు’’ అని పొగడ్తలతో ముంచెత్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?