ఎక్కువగా ఊహించుకుంటున్నాడని భావించా.. గంగూలీ అలా చేయడంతో షాక్కు గురయ్యా!
విజయం కోసం మైదానంలో దూకుడుగా ఉండే క్రికెటర్లు.. బయట మాత్రం చాలా స్నేహపూర్వకంగానే ఉంటారనేది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా మ్యాచ్ సందర్భంగా...
పాకిస్థాన్ క్రికెట్ ప్రధాన కోచ్ సక్లయిన్ ముస్తాక్
ఇంటర్నెట్ డెస్క్: విజయం కోసం మైదానంలో దూకుడుగా ఉండే క్రికెటర్లు.. బయట మాత్రం చాలా స్నేహపూర్వకంగానే ఉంటారనేది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా మ్యాచ్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్లతోపాటు అభిమానులు ఉద్వేగభరితంగా ఉంటారు. అయితే ఒక్కసారి మ్యాచ్ ముగిశాక మాత్రం ఇరు జట్ల ప్లేయర్లు ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలతో పాక్ మాజీ ప్లేయర్లు షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్, వసీమ్ అక్రమ్, ఇంజమామ్ స్టేడియం వరకే పోటాపోటీగా ఉండేవారు. ఈ క్రమంలో గంగూలీతో జరిగిన ఓ సంఘటనను పాక్ క్రికెట్ ప్రధాన కోచ్ సక్లయిన్ ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. తొలుత గంగూలీ గురించి తప్పుడు అభిప్రాయంతో ఉండేవాడినని.. అయితే బీసీసీఐ అధ్యక్షుడు చేసిన దానికి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు.
‘‘మొదటిసారి నేను గంగూలీని కలిసేటప్పుడు కాస్త కంగారు పడ్డా. ఎందుకంటే అతడు టీమ్ఇండియా కెప్టెన్, దిగ్గజ క్రికెటర్. అలాంటి వ్యక్తి నిన్ను ఎందుకు కలుస్తాడని కొందరు చెప్పడంతో ఆందోళన ఇంకొంచెం పెరిగింది. అయితేనేం చివరికి కలిశా.. కానీ ‘హలో’, ‘హాయ్’ మాటలకే గంగూలీ పరిమితమయ్యాడు. దీంతో దాదా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని భావించా. ఎప్పుడూ మాట్లాడకూడదని అనుకొన్నా. అయితే 2003-2004 సీజన్లో భారత్తో ఆడేందుకు నాకు మళ్లీ అవకాశం వచ్చింది. అప్పటికే నా మోకాలికి చిన్న ఆపరేషన్ జరిగింది. సచిన్ కూడా ఎల్బోకి శస్త్రచికిత్స చేయించుకొని జట్టులోకి వచ్చాడు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొన్న తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ అదే. అప్పటికే సస్సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ సాధించా’’ అని వివరించాడు.
ఈ క్రమంలో గంగూలీ చేసిన పనికి ఆశ్చర్యంతోపాటు అతడిపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసిందని ముస్తాక్ తెలిపాడు. ‘‘భారత్తో సిరీస్ సందర్భంగా ఇరు జట్లకూ పక్కపక్కనే డ్రెస్సింగ్ రూమ్లు ఉండేవి. చిన్న గోడ మాత్రమే అడ్డు. దీంతో గంగూలీ రెండు కాఫీ కప్లతో వచ్చాడు. గోడ దగ్గరకు వచ్చాక ఎలా రావాలని ఆలోచిస్తుండగా.. గోడ దూకైనా రావచ్చు, లేకపోతే వెనక నుంచి తిరిగి రావచ్చు అని చెప్పా. అయితే గంగూలీ గోడపై నుంచి జంప్ చేశాడు. రెండు కాఫీ కప్లను చేతిలో ఉంచుకొని మరీ సౌరభ్ గోడను దూకి రావడంతో షాక్కు గురయ్యా. కాఫీ ఇచ్చి దాదాపు 30 నిమిషాలపాటు నాతో మాట్లాడాడు. ఆశ్యర్యపోవడం నావంతైంది. గతంలో గంగూలీ గురించి అలా అనుకోవడం గుర్తొచ్చి అప్పుడు నామీద నాకే సిగ్గుగా అనిపించింది. నా మోకాలి గాయం గురించి అడిగిన గంగూలీ జాగ్రత్తలు చెప్పాడు’’ అని సక్లయిన్ ముస్తాక్ చెప్పాడు. భారత్-పాక్ పోరులో సచిన్-ముస్తాక్ మధ్య జరిగే పోటీ అప్పట్లో అభిమానులను అలరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!