కోహ్లీసేన నాగాస్త్రం.. నాగ్వాస్వాలా!
అర్జాన్ నాగ్వాస్వాలా.. టీమ్ఇండియా కొత్త ఆటగాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సహా ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్బైగా ఎంపికైన క్రికెటర్. భువనేశ్వర్...
బంతి స్వింగ్ చేస్తే వికెట్లు పడాల్సిందే..
అర్జాన్ నాగ్వాస్వాలా.. టీమ్ఇండియా కొత్త ఆటగాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సహా ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్బైగా ఎంపికైన క్రికెటర్. భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లను కాదని సెలక్టర్లు అర్జాన్ను ఎందుకు ఎంపిక చేశారు? అతడి ఎంపిక వెనక తర్కం ఏంటి? అతడి ప్రత్యేకత ఏంటి?
దేశవాళీ సంచలనం
గుజరాత్కు చెందిన అర్జాన్ దేశవాళీ క్రికెట్లో ఓ సంచలనం. ఈ ఎడమచేతి వాటం పేసర్ రంజీల్లో ప్రకంపనలు సృష్టించాడు. 23 ఏళ్ల వయసున్న అతడు 2018లో గుజరాత్ తరఫున రాజస్థాన్పై లిస్ట్-ఏ మ్యాచులో అరంగేట్రం చేశాడు. ఫస్ట్క్లాస్లో 16 మ్యాచుల్లో 22.53 సగటు, 3.02 ఎకానమీతో ఏకంగా 62 వికెట్లు తీశాడు. ఇక 20 లిస్ట్-ఏ మ్యాచుల్లో 21.76 సగటుతో 39, 15 టీ20ల్లో 16.38 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.
అందుకే.. ఎంపిక
అర్జాన్ టీమ్ఇండియాకు ఎంపికైయ్యేందుకు ప్రధాన కారణం అతడు ఎడమచేతి వాటం పేసర్ కావడమే. అంతేకాకుండా అతడి గణాంకాలు సైతం ఎంతో బాగున్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం.. ఊరించే లైన్ అండ్ లెంగ్తుల్లో బంతులు వేసి వికెట్లు తీయడం అతడి ప్రత్యేకత. పరుగులు నియంత్రించడంలోనూ మేటి. శస్త్రచికిత్స చేయించుకొన్న నటరాజన్ విశ్రాంతి తీసుకోవడం, ఇంగ్లాండ్ జట్టులో ఎడమచేతి వాటంతో బంతిని స్వింగ్ చేసే బౌలర్లు ఎక్కువగా ఉండటంతో సెలక్టర్లు అర్జాన్ను స్టాండ్బైగా ప్రకటించారు. అక్కడి పరిస్థితులకు భారత బ్యాట్స్మెన్ అలవాటు పడేందుకు అతడి బౌలింగ్ ఎంతగానో ఉపయోగపడనుంది.
తొలి సీజన్లోనే మాయ
రంజీల్లో బరోడాపై అరంగేట్రం చేసిన నాగ్వాస్ ఆ పోరులో తీసింది ఒకే ఒక్క వికెట్టు. కానీ ఆ సీజన్ పూర్తయ్యే సరికి అతడిలోని ప్రతిభ, సామర్థ్యం అందరికీ తెలిసిపోయాయి. 8 మ్యాచులాడి 21 వికెట్లు తీశాడు. 5/90 అత్యుత్తమం. ముంబయి మ్యాచులో నమోదు చేశాడు. సూర్యకుమార్, అర్మన్ జాఫర్, సిద్దేశ్ లాడ్, ఆదిత్య తారె వంటి సీనియర్ ఆటగాళ్లను పెవిలియన్ పంపి గుజరాత్కు 9 వికెట్ల తేడాతో విజయం అందించాడు.
ఇక ఆ తర్వాతి సీజన్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. వికెట్ల వరద పారించాడు. బౌలింగ్ పరంగా మరింత అనుభవం, ఆత్మవిశ్వాసం సాధించాడు. కేవలం 8 మ్యాచుల్లో 18.36 సగటుతో ఏకంగా 41 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. కొన్నాళ్ల క్రితం ముగిసిన విజయ్ హజారేలో 7 మ్యాచుల్లో 4.32 సగటుతో 19 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్లో 5 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
అన్నను చూసి..
ఈ యువ ఆటగాడి పూర్తి పేరు అర్జాన్ రోహింగ్టన్ నాగ్వాస్వాలా. 1997, అక్టోబర్17న జన్మించాడు. గుజరాత్ సరిహద్దు పట్టణమైన అంబర్గావ్ సమీపంలోని నర్గల్ అతడి స్వస్థలం. ఎడమచేతి వాటంతో బౌలింగ్ చేసే అతడు కుడిచేత్తో బ్యాటింగ్ చేస్తాడు. గుజరాత్ తరఫున అండర్-16, అండర్-19 ఆడాడు. ఇక 1995 తర్వాత రంజీ ట్రోఫీ ఆడిన తొలి పార్సీ క్రికెటర్ సైతం అర్జానే. తన సోదరుడు విస్పీ క్రికెట్ ఆడటం చూసి ఆటపై మక్కువ పెంచుకోవడం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్