Mitali Parulekar: అంకుర సంస్థ స్థాపించి.. శార్దూల్తో ఏడడుగులు వేసి!
టీమ్ ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (shardul thakur) తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ (Mitali Parulekar)ను వివాహమాడాడు. ఇంతకీ ఎవరీ మిథాలీ పారుల్కర్?
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ (Mitali Parulekar)తో ఏడడుగులు వేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమవ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబరులో నిశ్చితార్థం జరిగింది. సోమవారం రాత్రి ముంబయిలో ఓ ఫంక్షన్ హాల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఎవరీ మిథాలీ పారుల్కర్?
బేకరీ సంస్థను స్థాపించి..
మిథాలీ పారుల్కర్.. ఓ బిజినెస్ పర్సన్. మహారాష్ట్రలోని థానేలో ‘ఆల్ ది జాజ్.. లగ్జరీ బేకర్స్’ పేరుతో ఓ బేకరీ సంస్థను నెలకొల్పారు. ముంబయిలోనూ ఈ సంస్థకు కార్యాలయాలున్నాయి. 2020 ఫిబ్రవరిలో ఈ సంస్థను ఏర్పాటు చేసిన మిథాలీ.. అదే పేరుతో ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. వివిధ రకాల కేక్లు, కుకీస్, బ్రెడ్ తదితర బేకరీ ఉత్పత్తులను ఆన్లైన్లోనూ, నేరుగా విక్రయిస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మిథాలీ చురుగ్గా ఉంటుంది.
కెరీర్ సాగిందిలా..
అంకుర సంస్థ స్థాపించి విజయం సాధించిన మిథాలీ పారుల్కర్.. వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించారు. శార్దూల్ ఠాకూర్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇంటర్నెట్లో ఆమె కోసం విరివిగా సెర్చ్ చేశారు. మిథాలీ పారుల్కర్ 1992లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ పేరున్న కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసమంతా ముంబయిలోనే సాగింది. 2014లో మిథీబాయ్ కళాశాల నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2015లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె.. బహుళజాతి సంస్థ జేఎస్డబ్ల్యూలో ఇంటర్న్షిప్లో చేరారు. ఆ తర్వాత 2017లో బ్లూస్టార్ డైమండ్స్లో కంపెనీ సెక్రెటరీగా పని చేశారు. 2018 అక్టోబరు వరకు అందులోనే పని చేసిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. చేతక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ సెక్రెటరీగా 2019 మేలో ఉద్యోగం మారారు. 2020 వరకు ఆ సంస్థలో పని చేశారు. ఈ సమయంలోనే మోడలింగ్ చేసేందుకు ఆసక్తి చూపినా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఆ రంగాన్ని వదిలేశారు. చివరికి ఫిబ్రవరి 2020లో సొంతగా బేకరీ సంస్థను నెలకొల్పి వ్యాపారం కొనసాగిస్తున్నారు. థానేలో చదువుకుంటున్న రోజుల్లోనే శార్దూల్తో ప్రేమలో పడ్డారు.
మిథాలీ గురించి ఇంకాస్త..
- ఇష్టమైన నటుడు- ఆమిర్ ఖాన్
- నచ్చిన ఆహారం.. శాకాహారం
- ఇష్టమైన గాయకుడు -అఖిల్
- ఇష్టమైన ఆట -క్రికెట్
- నచ్చిన ప్రదేశం - ఇరాక్
- పెంపుడు జంతువులంటే బాగా ఇష్టం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ