Cricket News: అజ్జూ భాయ్ ప్రశ్నకు జవాబు తెలుసా?
1999 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్, టీమ్ఇండియా పోరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరో చెప్తారా? అని ప్రశ్నిస్తున్నాడు మహ్మద్ అజహరుద్దీన్. కఠిన పరిస్థితులు ఎదురైనా.. ఆటను మరుసటి రోజు కొనసాగించినా....
1999 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్, టీమ్ఇండియా పోరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరో చెప్తారా? అని ప్రశ్నిస్తున్నాడు మహ్మద్ అజహరుద్దీన్. కఠిన పరిస్థితులు ఎదురైనా.. ఆటను మరుసటి రోజు కొనసాగించినా.. అద్భుత విజయం సాధించామని గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడో ట్వీట్ చేశాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్-1999లో మే 30న టీమ్ఇండియా ఇంగ్లాండ్తో తలపడింది. సౌరవ్ గంగూలీ (40), రాహుల్ ద్రవిడ్ (53), అజయ్ జడేజా (39) రాణించడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆంగ్లేయులను 169కే ఆలౌట్ చేసింది భారత్. దాదా తన మీడియం పేస్తో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే 10 ఓవర్లు విసిరి 2/30తో రాణించాడు. జవగళ్ శ్రీనాథ్ 8.3 ఓవర్లు విసిరి 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచును మరుసటి రోజు కొనసాగించారు. తేమ, వాతావరణం ఉపయోగించుకొని బౌలర్లు రాణించారు.
‘ప్రపంచకప్-99లో మే 30న మేం ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించాం. మేం అత్యంత కఠిన పరిస్థితుల్లో పోరాడాం. మ్యాచ్ను మరుసటి రోజు కొనసాగించారు. తేమ, మబ్బులు, వాతావరణ పరిస్థితులను ఉపయోగించుకొని మా బౌలర్లు రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిచ్చారో గుర్తుందా?’ అని అజ్జూ ట్వీట్ చేశాడు. గంగూలీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు