జడేజా సిక్సర్ల వర్షం.. పృథ్వీ బౌండరీల మోత
ఐపీఎల్ 14 సీజన్లో మ్యాచ్లు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్ల ఫలితం చివరి బంతి వరకూ తేలడం లేదు. అయితే, కొంతమంది బ్యాట్స్మెన్ బౌలర్లపై ఇసుమంతైనా కనికరం చూపడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 14 సీజన్లో మ్యాచ్లు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్ల ఫలితం చివరి బంతి వరకూ తేలడం లేదు. అయితే, కొంతమంది బ్యాట్స్మెన్ బౌలర్లపై ఇసుమంతైనా కనికరం చూపడం లేదు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలకు పంపుతూ పరుగుల వరద పారిస్తున్నారు. కొందరు ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఏకంగా 30కిపైగా పరుగులు రాబడుతున్నారు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఒక ఓవర్లో అత్యధికంగా ఎన్ని పరుగులు చేశాడో ఓ లుక్కేద్దాం.
జడేజా సిక్సర్ల వర్షం
ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో 36 పరుగులు చేసి క్రిస్గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడ్డూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సిక్స్లు బాదాడు. మరో ఫోర్ ఫోర్ కూడా కొట్టి రెండు పరుగులు చేశాడు. కాగా..ఇందులో మూడో బంతి నో బాల్. ఈ ఓవర్లో మొత్తం 37 పరుగులు వచ్చాయి.
కమిన్స్ మెరుపులు
ఏప్రిల్ 21న కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఒకే ఓవర్లో 30 పరుగులు చేశాడు. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన కమిన్స్..తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి..చివరి బంతిని స్టాండ్స్కు పంపాడు. దీంతో ఈ ఓవర్లో కమిన్స్ 30 పరుగులు రాబట్టాడు.
పృథ్వీ ‘షో’
ఏప్రిల్ 29న దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన పోరులో దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించి ఒకే ఓవర్లో 24 పరుగులు రాబట్టాడు. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో షా ఏకంగా 6 బంతుల్లో ఆరు బౌండరీలు బాది రికార్డు సృష్టించాడు.
డివిలియర్స్ అదుర్స్
ఏప్రిల్ 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఒకే ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు. స్టోయినిస్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన ఏబీ..రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. తర్వాత నాలుగు, ఐదు బంతులను కూడా స్టాండ్స్కు పంపి చివరి బంతికి రెండు పరుగులు చేశాడు.
రసెల్ జిగేల్
ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో రసెల్ 22 పరుగులు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో తొలి బంతికి సిక్స్ కొట్టిన రసెల్..రెండో బంతికి ఫోర్ బాదాడు. మూడో బంతిని సిక్సర్గా మలిచిన విండీస్ వీరుడు..చివరి బంతిని కూడా స్టాండ్స్కు పంపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్