ఆరంభ పోరులో గెలుపెవరిది?
పొట్టి క్రికెట్ వేడుకకు వేళైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి ముస్తాబైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి, రన్నరప్ చెన్నై వీనులవిందైన ఆటతో అభిమానుల మనసుల్ని పసందు చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లుచెదిరే సిక్సర్లు.. వికెట్లను ఎగరగొట్టే బంతులతో రంజింపచేసేందుకు ఆటగాళ్లు రెడీగా...
ముంబయి×చెన్నై పోరుపై పెరిగిన ఆసక్తి
పొట్టి క్రికెట్ వేడుకకు వేళైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి ముస్తాబైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి, రన్నరప్ చెన్నై వీనులవిందైన ఆటతో అభిమానుల మనసుల్ని పసందు చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లుచెదిరే సిక్సర్లు.. వికెట్లను ఎగరగొట్టే బంతులతో రంజింపచేసేందుకు ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. తొలి సమరంలో బాహాబాహీకి దిగుతున్న రెండు జట్ల బలాబలాలేంటో తెలుసుకుందాం పదండి మరి!
ముంబయిదే పైచేయి
లీగులోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి, చెన్నై. రోహిత్ నాలుగుసార్లు తన జట్టును విజేతగా నిలిపితే చెన్నైకి మహీ మూడుసార్లు ట్రోఫీ అందించాడు. ఎక్కువ ఫైనళ్లు ఆడింది చెన్నై కాగా ఆడిన ఫైనళ్లలో ఎక్కువగా గెలిచింది మాత్రం మరాఠాలే. మొత్తంగా ఈ రెండు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా ముంబయి 17, చెన్నై 11 విజయాలు అందుకున్నాయి. నాలుగు సీజన్లలో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీపడితే మూడుసార్లు ముంబయే గెలవడం గమనార్హం. అందుకే ఈ రెండు జట్లూ తలపడుతున్నాయంటే దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఎడతెగని ఆసక్తి ఏర్పడుతుంది.
సగటు 140
అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ముంబయికి ఇదే సొంత మైదానం. ఆ జట్టు ఇక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుంది. దుబాయ్ నుంచి చెన్నై వస్తోంది. అంటే ఇక్కడి పరిస్థితులేమిటో తెలియకపోవడంతో ఆడటం ధోనీసేనకు ఆడటం సవాలే. పొడిగా ఉండే ఈ పిచ్పై భారీ స్కోర్లేమీ నమోదవ్వవు. ఏడాదిన్నరగా ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 140గా ఉంటోంది. మైదానం పెద్దది కావడంతో సిక్సర్లు బాదే అవకాశం తక్కువ. ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టొచ్చు. నెమ్మది పిచ్ కావడంతో సింగిల్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
సారథులే బలం
సారథులే ఈ రెండు జట్లకు ప్రధాన బలం. మహీ, రోహిత్ నాయకత్వ శైలి దాదాపు ఒకేలా ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహిస్తారు. అవసరమైతేనే కలగజేసుకుంటారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటారు. ధోనీ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించినా హిట్మ్యాన్ సైతం తక్కువోడేమీ కాదు. డికాక్, రోహిత్, క్రిస్లిన్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్, హార్దిక్, కృనాల్తో ముంబయి బ్యాటింగ్ అత్యంత భీకరంగా కనిపిస్తోంది. చెన్నైకి టాప్ ఆర్డర్పై స్పష్టత లేదు. రాయుడు, వాట్సన్, ధోనీ, మురళీ విజయ్, కేదార్పై ఆధారపడాల్సి ఉంది. రుతురాజ్ అందుబాటులో లేడు. అయితే జడ్డూ, దీపక్ బ్యాటు ఝుళిపించగలరు. బౌలింగ్ పరంగానూ ముంబయికి తిరుగులేదు. పవర్ప్లే, డెత్ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా ఉన్నాడు. అతడికి తోడుగా ట్రెంట్ బౌల్ట్ కొత్తబంతిని పంచుకోగలడు. ధవళ్ కులకర్ణి, నేథన్ కౌల్టర్నైల్, ప్యాటిన్సన్ ఉన్నారు. చక్కని స్పిన్నర్లూ ఆ జట్టు సొంతం. హార్దిక్పాండ్య ఎప్పటిలాగే ఎక్స్ ఫ్యాక్టర్ అవ్వగలడు. ఇక ధోనీ సేనలో జడ్డూ, పియూష్, తాహిర్, కేదార్, శాంట్నర్, కర్ణశర్మ స్పిన్ దాడికి సిద్ధంగా ఉన్నారు. హేజిల్వుడ్, బ్రావో, చాహర్, ఎంగిడి పేస్ విభాగం చూసుకుంటారు.
చాహర్×రోహిత్
ముంబయిలో మలింగ, చెన్నైలో రైనా, భజ్జీ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. కొవిడ్-19 కారణంగా ధోనీసేనకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. రోహిత్ బృందం మాత్రం సాధనను ఆస్వాదించింది. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల దీపక్ బౌలింగ్లో రోహిత్కు మెరుగైన రికార్డేమీ లేదు. టీ20ల్లో ఆరు ఇన్నింగ్సుల్లో పవర్ప్లేలో అతడు రెండుసార్లు ఔటయ్యాడు. 29 బంతుల్లో 24 పరుగులే చేశాడు. అయితే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగోకు ట్రోఫీ అందంచిన పొలార్డ్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఆఖర్లో ఎంఎస్ ధోనీని ఇబ్బంది పెట్టగల బుమ్రా, బౌల్ట్, కౌల్టర్ నైల్ ముంబయిలో ఉండటం గమనార్హం.
అంచనా జట్లు
చెన్నై: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, ఎంఎస్ ధోనీ (కె, వి), కేదార్ జాదవ్, డ్వేన్బ్రావో, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్
ముంబయి: రోహిత్ శర్మ (కె), క్వింటన్ డికాక్ (వి), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, నేథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM