cricket: మైదానంలో బంతి కనిపించడంలేదు.. ఎందుకంటే..!
క్రికెట్లో నిబంధనలు బౌలింగ్ను మరింత కఠినంగా మార్చేస్తున్నాయి . దీనికి తోడు గాయాలబెడద వారి కెరీర్లను వేగంగా పతనం చేస్తోంది. అన్నింటికి మించి ఆదాయ పరంగా చూసుకొన్నా.. బ్యాటర్లకు ఉన్న తళుకుబెళుకులు బౌలర్లకు ఉండటంలేదనేది కాదనలేని వాస్తవం.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: ‘‘నువ్వు బౌలర్ కావాలని అస్సలు అనుకోవద్దు’ అని నా కుమారుడికి చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతి మీద కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్ కావాలనేది నా కల. అతడికి రోజూ శిక్షణ ఇప్పిస్తున్నా. నెట్స్లో నేనే బౌలింగ్ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్లో నేను బౌలింగ్ చేస్తున్నందుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్గా మారితే ఓ పదేళ్లలో రూ.20 కోట్లైనా ఇస్తారు. నా కొడుకు కోసం ఓ రూ.20 కోట్లు పక్కనపెట్టుకోవాలని ముంబయి ఇండియన్స్కు చెప్పా’’.. భారత స్పిన్నర్ పియూష్ చావ్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలర్ల పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. మారిపోతున్న ఆట నిబంధనలు కూడా బౌలింగ్ను ఓ కఠినమైన ప్రక్రియగా మార్చేస్తున్నాయి.
ఒకప్పుడు వెస్టిండీస్ పేస్ దళం బౌన్సర్లతో బ్యాటర్లను గజగజలాడించేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గంటకు 150 కి.మీ.తో బౌలింగ్ చేసినా బంతి అలవోకగా బౌండరీలైను దాటేస్తోంది. దీనికి తోడు క్రికెట్ ఫార్మాట్లలో ఓవర్లను కుదించే కొద్దీ బౌలర్లు సంధించే బంతులను ఊచకోత కోయడం పెరిగిపోతోంది. 2011కు ముందు 6,333 వన్డే మ్యాచుల్లో 393 సార్లు 300+ స్కోర్లు చేశారు. కానీ, 2011 తర్వాత నుంచి 2020 వరకు 1,606 మ్యాచుల్లో 257 సార్లు స్కోర్బోర్డ్ 300 దాటేసిందంటే బ్యాటర్ల విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. టీ20 బాగా పాపులర్ అయ్యాక.. వన్డేల్లో 300 స్కోరు సాధారణమైపోయింది. ఇది బౌలర్లను ఏ స్థాయిలో ఆడేసుకుంటున్నారో తెలియజేస్తోంది.
క్రికెట్లో బౌలర్లకు అత్యధిక ఫిట్నెస్ అవసరం. అందులో పేస్ బౌలర్లకైతే మరీను..! వీరు తమ శరీరంలోని శక్తిని బంతికి జోడించి బ్యాటర్లపైకి సంధించాల్సి ఉంటుంది. గాయాలబారిన పడే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఫిట్నెస్లో ఏమాత్రం తేడా వచ్చినా ఎంతటి బౌలరైనా జట్టుకు దూరం కావాల్సిందే. జస్ప్రీత్ బుమ్రానే దీనికి సరైన ఉదాహరణ.
రెండు బంతుల నిబంధనలతో..
క్రికెట్లో ప్రతి ఇన్నింగ్స్లో రెండు ఎండ్ల వైపు నుంచి రెండు కొత్త బంతులతో బౌలింగ్ను ప్రారంభిస్తారు. వీటిని 25 ఓవర్లు వినియోగిస్తారు. అంటే వన్డేల్లో బౌలర్కు రివర్స్ స్వింగ్ లభించాలంటే కనీసం 40 ఓవర్ల ఆట పూర్తయి ఉండాలి. కేవలం చివరి 10 ఓవర్లలో మాత్రమే సీమర్లకు రివర్స్ స్వింగ్ సాధ్యపడుతుంది. దీంతో సీమర్లు మరింత చమటోడ్చాల్సిన పరిస్థితి. 2011లో ఈ నిబంధన రాక ముందు వన్డేల్లో ప్రతి 16.1 ఇన్నింగ్స్లకు సగటున ఒకసారి 300 స్కోర్లు నమోదైతే.. 2011 తర్వాత పదేళ్లలో ప్రతి 6.2 ఇన్నింగ్స్ల తర్వాత ఒకసారి స్కోర్బోర్డు 300 దాటేస్తోంది.
ఫీల్డింగ్ నిబంధనలు..
ఫీల్డింగ్ నిబంధనలు కేవలం బ్యాటర్కు అనుకూలంగానే ఉంటున్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. వన్డేల్లో తొలి 10 ఓవర్లలో 30యార్డ్స్ సర్కిల్ బయట కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. 11-40 ఓవర్ల మధ్యలో నలుగురికి అవకాశం లభిస్తుంది. చివరి 10 ఓవర్లలో మాత్రమే ఐదుగురు ఫీల్డర్లను బౌండరీల వద్ద మోహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. తమ బౌలింగ్ వ్యూహాలకు అనుగుణంగా ఫీల్డింగ్ను పెట్టుకొనే అవకాశం లేదు.
ఫ్రీహిట్తో సమస్య..
నోబాల్కు ఫ్రీహిట్ కూడా జతకలవడంతో బౌలర్లకు నరకప్రాయంగా మారింది. ఈ ఫ్రీహిట్ సమయంలో రనౌట్ మినహా బ్యాటర్లను ఔటు చేయడానికి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఈ ఫ్రీహిట్లు మ్యాచ్ ఫలితాలను మార్చేసిన సందర్భాలుండటంతో.. బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన సిరీస్లో యువబౌలర్ అర్ష్దీప్ సింగ్ వరుసగా మూడు నోబాల్స్ వేశాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక, ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో ఈ నోబాల్ కారణంగానే హైదరాబాద్ చివరి బంతికి విజయం దక్కించుకుంది.
బౌన్సర్లపై ఆంక్షలు..
ఒక ఓవర్లో బ్యాటర్ ఆరు బంతులను సిక్స్లు కొట్టేందుకు అవకాశం ఉన్నా.. బౌలర్కు మాత్రం ఆరు బౌన్సర్లు వేసే అవకాశం లేదు. కేవలం ఒక బౌన్సర్కు మాత్రమే అనుమతి ఉంది. ఆ తర్వాత కూడా బౌన్సర్ విసిరితే.. బ్యాటర్కు 1 పరుగు ఇవ్వడంతోపాటు నోబాల్గా ప్రకటిస్తారు.
ఫైన్లెగ్ నిబంధనలతో కళ్లెం..
బాడీలైన్ బౌలింగ్ను నిరోధించేందుకు ఫైన్లెగ్లో ఫీల్డర్ల సంఖ్యను పరిమితం చేశారు. ఫైన్లెగ్లో ఒక్కఫీల్డర్ మాత్రమే ఉండటంతో బౌలర్ విసిరిన బంతి ఏమాత్రం లెగ్సైడ్ వైడ్ అయినా.. బ్యాటర్ దానిని కొడితే ఫోర్ రావడం దాదాపు ఖాయం.
ఫ్లాట్ పిచ్లు.. ఫాస్ట్ ఔట్ఫీల్డ్లు..
ఇటీవల కాలంలో బ్యాటింగ్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫ్లాట్ పిచ్లు తయారు చేస్తున్నారు. హైవేలను తలపించే పిచ్లపై పరుగుల వరద పారుతోంది. దీనికి తోడు వేగవంతమైన ఔట్ఫీల్డ్లు, మైదానంలోని చిన్న బౌండరీలైన్లు బౌలర్ల పనిని మరింత జఠిలం చేస్తున్నాయి.
అన్నింటికి మించి ఆకర్షణీయమైన సంపాదన..
క్రికెట్లో బ్యాటర్లు మరింత ఆకర్షణీయంగా మారారు. భారత క్రీడల్లో గతేడాది 505 ఎండార్స్మెంట్లు జరిగితే వాటిల్లో 381 డీల్స్ క్రికెటర్లకే దక్కాయి. క్రికెటర్లకు రూ.640 కోట్లు దక్కగా.. మిగిలిన క్రీడలకు రూ. 109 కోట్లు లభించాయి. టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (అన్ని ఫార్మాట్లలో కలిపి 953 ) కంటే అత్యధిక పరుగులు చేసిన సచిన్ (అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357)కు వాణిజ్య ప్రకటనల ఆదాయం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఎండార్స్మెంట్లలో విరాట్, రోహిత్, ధోని హవా నడుస్తోంది. వీరు ముగ్గురు.. ఒక్కొక్కరూ 30 బ్రాండ్లకు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. సూర్యకుమార్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు కొత్తగా వాణిజ్య ప్రకటనలు దక్కించుకొంటున్న క్రికెటర్లలో ఉన్నారు. వీరందరిలో బుమ్రా ఒక్కరే బౌలర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ