IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో మంచి రిథమ్తో బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మను కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) డిస్టర్బ్ చేయడాన్ని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ (GT) విజయ తీరాల వరకు వచ్చి బోల్తాపడింది. చివరి ఓవర్లో చెన్నై (CSK) గెలుపునకు 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో బౌలర్ మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. దీంతో అంతా గుజరాత్ విజయం ఖాయమనుకున్నారు. అప్పటి వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ చివరి రెండు బంతుల్లో పట్టుతప్పాడు. వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకుని వరుసగా 6, 4 బాది జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెళ్లి డిస్టర్బ్ చేయడంతోనే బౌలర్ లయ తప్పాడని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు హార్దిక్ మధ్యలో జోక్యం చేసుకోవడం అవసరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘యార్కర్లు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నప్పుడు బౌలర్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బ్యాటర్కు 2 బంతుల్లో 10 పరుగులు అవసరమని, అతడికి యార్కర్లు సంధించి అడ్డుకట్ట వేయాలని బౌలర్కు తెలుసు. అలాంటప్పుడు మీరు అతని (బౌలర్) సమయాన్ని ఎందుకు వృథా చేస్తారు? ఒక వేళ మోహిత్ శర్మ ఎక్కువ పరుగులు ఇచ్చుకుంటే అతడితో మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ, అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓవర్ త్వరగా పూర్తికోవాలని కోరుకోవాలి. చివరి రెండు బంతుల్లో బౌలర్ ఫీల్డింగ్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నాడా అనే ఆందోళన కెప్టెన్ (హార్దిక్)కు వచ్చి ఉండవచ్చు. కానీ, నేను ఆ స్థానంలో ఉంటే.. బౌలర్ని డిస్టర్బ్ చేయకపోయేవాడిని’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మంచి రిథమ్తో బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మను హార్దిక్ పాండ్య డిస్టర్బ్ చేయడాన్ని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా తప్పుబట్టాడు. ఫైనల్లో గుజరాత్పై సీఎస్కే చివరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్ను ఖాతాలో వేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)