MS Dhoni: బెంగళూరు vs చెన్నై.. ధోనీ ఈ రికార్డులు బద్దలుకొడతాడా?

టీ20 మెగా టోర్నీలో చెన్నై సారథిగా తిరిగి పగ్గాలు అందుకున్నర మహేంద్ర సింగ్‌ ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. గత ఆదివారం పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 13 పరుగుల తేడాతో

Updated : 04 May 2022 18:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 మెగా టోర్నీలో చెన్నై సారథిగా తిరిగి పగ్గాలు అందుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. గత ఆదివారం పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం ఇదే వేదికపై బెంగళూరుతో ధోనీ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోనీ ముందు పలు వ్యక్తిగత  రికార్డులు ఉన్నాయి. మరి వాటిని మిస్టర్‌ కూల్‌ అందుకోగలడా..?

ధోనీ ముందున్న రికార్డులివే..

* టీ20 మెగా టోర్నీలో ధోనీకిది 200వ మ్యాచ్‌. ఈ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడుతున్న రెండో ఆటగాడు ఇతడే. బెంగళూరు తరఫున కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌లోనే 200వ మ్యాచ్‌ ఆడిన కోహ్లీ.. టీ20 మెగా లీగ్‌ టోర్నీలో ఇప్పటివరకు 217 మ్యాచ్‌లు ఆడాడు. 2016, 2017లో చెన్నై జట్టు టోర్నీకి దూరమవడంతో ధోనీ 30 మ్యాచ్‌లు పుణె తరఫున ఆడాల్సి వచ్చింది. 

* ఇక టీ20 కెప్టెన్‌గా ధోనీకి ఇది 302వ మ్యాచ్‌. టీ20ల్లో ఇప్పటివరకు సారథిగా 5994 పరుగులు సాధించిన ధోనీ.. మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అంతేగాక, కెప్టెన్‌గా టీ20ల్లో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. 6451 పరుగులతో కోహ్లీ ఈ జాబితాలో ముందున్నాడు. 

* టీ20 మెగా టోర్నీలో బెంగళూరుపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు చేశాడు. ఇందులో 46 సిక్స్‌లు ఉన్నాయి. మరో నాలుగు సిక్స్‌లు కొడితే ఈ మెగా టోర్నీలో ఒక జట్టుపై 50 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని