Ind Vs Aus: చిక్కేనా సిరీస్?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థానం ఊరిస్తోంది. కానీ తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. ఒక్క ఓటమితో జట్టు బలహీన పడ్డట్లు కనిపిస్తోంది. బ్యాటర్ల ఫామ్ కూడా గొప్పగా లేదు.
పిచ్పైనే అందరి కళ్లు
ఆస్ట్రేలియాతో భారత్ చివరి టెస్టు నేటి నుంచే
ఉదయం 9.30 నుంచి
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థానం ఊరిస్తోంది. కానీ తొలి రెండు టెస్టుల్లో గెలిచినా.. ఒక్క ఓటమితో జట్టు బలహీన పడ్డట్లు కనిపిస్తోంది. బ్యాటర్ల ఫామ్ కూడా గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో బోర్డర్-గావస్కర్ సిరీస్లో టీమ్ఇండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక నాలుగో టెస్టు. సిరీస్ సమం చేయాలన్న తపన కంగారూలది. సిరీస్ విజయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తునూ ఒకేసారి సాధించాలన్న పట్టుదల భారత్ది. అహ్మదాబాద్లో రసవత్తర పోరు ఖాయం.
అహ్మదాబాద్
బోర్డర్ గావస్కర్ సిరీస్లో ఆఖరి పోరాటానికి వేళైంది. టీమ్ ఇండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లో నెగ్గడం రోహిత్సేనకు తప్పనిసరి. స్పిన్ వ్యూహం బెడిసి కొట్టి మూడో టెస్టులో దెబ్బతిన్న భారత్ ఎలా పుంజుకుంటుందో చూడాలి. స్మిత్ మరోసారి ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి రోజు ఆటను చూసేందుకు దాదాపు లక్ష మంది వస్తారని అంచనా.
భారత్ పుంజుకునేనా..!: మూడో టెస్టులో పరాజయం కచ్చితంగా టీమ్ఇండియాకు ఎదురుదెబ్బే. బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. నిజానికి మొత్తం సిరీస్లోనే భారత బ్యాటర్లు పెద్దగా ఫామ్లో లేరు. ఇప్పటివరకు రోహిత్, పుజారా మాత్రమే అర్ధశతకాలు చేసిన స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ నేపథ్యంలో పుంజుకోవడం భారత్కు సవాలే. రోహిత్, పుజారాలతో పాటు కోహ్లి కూడా సత్తా మేరకు రాణించాల్సివుంది. సిరీస్లో ఇప్పటి దాకా కోహ్లి 111 పరుగులు చేయగా.. పుజారా 98 మాత్రమే చేశాడు. వీళ్లిద్దరు ఎక్కువసేపు నిలవడం భారత్కు చాలా అవసరం. రోహిత్ (207) తర్వాత భారత టాప్ స్కోరర్ అక్షర్ పటేల్ (185) అంటే బ్యాటర్లు సిరీస్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. రోహిత్తో కలిసి యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ శుభారంభాన్నివ్వాలని జట్టు ఆశిస్తోంది. ఇక లోయర్ ఆర్డర్లో అక్షర్తో పాటు జడేజా, అశ్విన్ అంత తేలిగ్గా వికెట్ ఇస్తుండకపోవడం భారత్కు కలిసొచ్చే విషయమే. ఈ మ్యాచ్ కోసం భారత్.. ప్రధాన పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి తీసుకోనుంది. అతడు ఉమేశ్ యాదవ్తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోవచ్చు. మార్చి 17న ఆరంభమయ్యే వన్డే సిరీస్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న సిరాజ్కు ఈ మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. వికెట్కీపర్ స్థానం కోసం ఇషాన్ పోటీపడుతున్నాడు. అయితే బ్యాటుతో అనుకున్నంతగా రాణించకపోయినా భరత్కు మరో అవకాశం లభించవచ్చు.
ఉత్సాహంగా ఆసీస్: రెండు పరాభవాల తర్వాత ఇందౌర్లో విజయం కచ్చితంగా ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. ఆసీస్ బ్యాటింగ్ బాగానే కనిపిస్తోంది. గత రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ భారత టాప్ ఆర్డర్ కన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇందౌర్లో తొలి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 60 పరుగులు చేసిన ఖవాజా అదే ఫామ్ను కొనసాగించాలని ఆసీస్ ఆశిస్తోంది. అలాగే లబుషేన్, స్టీవ్ స్మిత్, హ్యాండ్స్ కాంబ్, గ్రీన్ బ్యాటుతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కుప్పకూలుతున్న లోయర్ ఆర్డర్ మాత్రం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశమే. ఈ విషయంలో భారత్ మెరుగు. ఒకవేళ లోయర్ ఆర్డర్ కుప్పకూలకుండా చూసుకుంటే ఆస్ట్రేలియాను ఓడించడం భారత్కు కష్టమే. ఆసీస్ బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. బౌలింగ్ కూడా సమతూకంగానే ఉంది. ఆ విభాగంలోనూ మార్పులు ఉండకపోవచ్చు.
పిచ్ ఎలా ఉందంటే
తొలి మూడు టెస్టుల్లో పిచ్లు విపరీతంగా సహకరించిన నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా మొతేరా పిచ్ ఎలా ఉందన్నదానిపైనే నిలిచింది. ఇందౌర్లో జరిగిన మూడో టెస్టులోనైతే పిచ్ మొదటి రోజు నుంచే స్పిన్నర్ల హవా నడించింది. పిచ్ పేలవమని రిఫరీ ఐసీసీకి నివేదిక కూడా ఇచ్చాడు. మొదటి మూడు మ్యాచ్ల్లో ఒక్కటీ మూడో రోజు దాటలేదు. అయితే సిరీస్ ఆరంభం నుంచి స్పిన్ దెబ్బకు విలవిల్లాడిన బ్యాటర్లకు నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ కాస్త ఊరటనిస్తుందని అంచనా. బంతి విపరీతంగా తిరగకపోవచ్చు. తొలి రోజైతే పిచ్ పూర్తి ఫ్లాట్గా ఉండొచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ‘‘సిరీస్లో ఇదే అన్నింటికన్నా ఫ్లాట్ పిచ్లా కనిపిస్తోంది. ఆట తొలి రోజు చాలా ఫ్లాట్గా ఉండబోతోంది’’ అని చెప్పాడు. అయితే వేడి వల్ల పిచ్ నెర్రెలు వచ్చి పిచ్ క్రమంగా స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలిపాడు.
403
తొలి మూడు టెస్టుల్లో నంబర్ 7 నుంచి 11 వరకు ఉన్న భారత బ్యాటర్లు 25.18 సగటుతో చేసిన పరుగులు. ఆసీస్ నంబర్ 7-11 బ్యాటర్లు 6.36 సగటుతో కేవలం 140 పరుగులే చేశారు.
48
అహ్మదాబాద్లో గత రెండు టెస్టుల్లో పడ్డ 60 వికెట్లలో స్పిన్నర్లు పడగొట్టిన వికెట్లు. అక్షర్ పటేల్ మూడు సార్లు అయిదు వికెట్ల ఘనత సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్