ఐపీఎల్ రేసులోకి పతంజలి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ రేసులోకి కొత్తగా రాందేవ్ బాబా అంబాసిడర్గా వ్యవహరిస్తున్న పతంజలి సంస్థ దూసుకొచ్చింది. తమ బ్రాండ్ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్ ఉపయోగపడగలదని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఆయుర్వేద ఆధారిత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను...
ట్విటర్లో భారీగా ట్రెండ్ అవుతున్న #PatanjaliIPL
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ రేసులోకి కొత్తగా రాందేవ్ బాబా అంబాసిడర్గా వ్యవహరిస్తున్న పతంజలి సంస్థ దూసుకొచ్చింది. తమ బ్రాండ్ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్ ఉపయోగపడగలదని ఆ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఆయుర్వేద ఆధారిత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విదేశాలకు ఎగమతి చేయాలని పతంజలి చాలాకాలంగా యోచిస్తోంది.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్-2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ప్రకటించింది. భారీ నియమావళిని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఆటగాళ్లు సైతం ఇంటి వద్ద, సమీపంలోని మైదానాల్లో సాధన చేస్తున్నారు. అయితే చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్గా కొనసాగుతున్న వివో మొబైల్ ఈ ఏడాదికి ఒప్పందం రద్దు చేసుకుంది. భారీఎత్తున వ్యతిరేకత రావడంతో విముఖత చూపించింది. దాంతో ఫ్రాంచైజీలు, బీసీసీఐ కలిసి దాదాపు రూ.440 కోట్ల వరకు నష్టపోనున్నాయి.
త్వరలోనే టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించనుంది. అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11, అన్అకాడమీ వంటి కంపెనీలు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిసింది. రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్ కోసం ఈ అవకాశం అందుకోవాలని అమెజాన్ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర సంస్థలను మించి అధికంగా టెండరు వేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉంది! ఇప్పుడు పతంజలి సైతం రావడంతో పోటీ ఎక్కువైంది. అయితే ఎవరు ఎంత మొత్తానికి టెండర్ వేస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎవరూ రూ.200 కోట్లకు మించి చెల్లించకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #PatanjaliIPL భారీగా ట్రెండ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్