ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా?
వన్డే సిరీసులో 1-2తో పరాజయం. టీ20ల్లో 2-1తో విజయ దరహాసం. లెక్క సరికావడంతో ఇప్పుడు అందరి చూపూ టెస్టు క్రికెట్పై పడింది. ఆటగాడి టెక్నిక్, సహనం, సామర్థ్యానికి పరీక్షపెట్టే సుదీర్ఘ ఫార్మాట్కు భారత్, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. సొంతగడ్డ.. నైపుణ్యమున్న పేసర్లు.. లైన్కు భిన్నంగా...
ఏడు విజయాల కంగారూలతో కోహ్లీసేనకు కష్టమే
వన్డే సిరీసులో 1-2తో పరాజయం. టీ20ల్లో 2-1తో విజయ దరహాసం. లెక్క సరికావడంతో ఇప్పుడు అందరి చూపూ టెస్టు క్రికెట్పై పడింది. ఆటగాడి టెక్నిక్, సహనం, సామర్థ్యానికి పరీక్షపెట్టే సుదీర్ఘ ఫార్మాట్కు భారత్, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. సొంతగడ్డ.. నైపుణ్యమున్న పేసర్లు.. లైన్కు భిన్నంగా ఆడగలిగే స్మిత్.. గులాబి టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ఆసీస్ సొంతం. అలాంటిది ఒకే డే/నైట్ టెస్టు అనుభవం ఉన్న కోహ్లీసేన ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరేనా?
గులాబి సవాళ్లు
అందమైన గులాబి పువ్వుకు ముళ్లున్నట్టే డే/నైట్ టెస్టులో గులాబి బంతిని ఎదుర్కోవాలంటే సవాళ్లు తప్పవు. ఎందుకంటే పింక్ చెర్రీతో ఆట సులువేమీ కాదు. సాధారణంగా ఆటగాళ్లంతా పగటి పూట ఎరుపు బంతి ఆడేందుకు అలవాటు పడి ఉంటారు. దాని స్వింగ్, సీమ్, స్పిన్, బౌన్స్ వంటి అంశాలపై అవగాహన ఉంటుంది. చేతి-కంటి సమన్వయం బాగుంటుంది. గులాబి బంతితో ఇవన్నీ కాస్త భిన్నంగా ఉంటాయి. రెడ్ చెర్రీతో ఉదయం అద్భుతమైన స్వింగ్ లభిస్తుంది. పిచ్పై పచ్చికలో తేమ బాగుంటే బౌలర్లు పండగ చేసుకుంటారు. డే/నైట్ మధ్యాహ్నం మొదలవుతుంది కాబట్టి అప్పుడు గులాబితో స్వింగ్ రాబట్టడం కష్టం. సాయంత్రం బంతి పక్కకు జరగడం మొదలవుతుంది. అప్పుడు బంతిని స్పష్టంగా చూడటంలో ఆటగాళ్లు ఇబ్బందులు పడతారు. సూర్యుడి నారింజ రంగు కాంతి, ఫ్లడ్లైట్ల వెలుతురులో బ్యాటింగ్ ఇబ్బందికరంగా మారుతుంది. క్యాచులు పట్టుకోవడం కష్టమవుతుంది. అయితే రాత్రిపూట గులాబి బంతి స్వింగ్ అద్భుతంగా ఉంటుందన్నది పేసర్ల మాట.
ఆసీస్ జైత్రయాత్ర
గులాబి బంతితో ఆడటంలో ఆసీస్ను మించిన జట్టు మరోటి లేదు. 2015 నుంచి వారు డే/నైట్ టెస్టు ఆడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏడు పింక్ టెస్టులు ఆడితే అన్నింట్లోనూ విజయం వారినే వరించింది. ఒక్క ప్రత్యర్థి జట్టూ వారికి గట్టి పోటీనిచ్చిందే లేదు. తొలి గులాబి పోరులో కివీస్ను 3 వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్. హేజిల్వుడ్ 9 వికెట్లతో చెలరేగాడు. టామ్ లేథమ్, స్టీవ్స్మిత్, పీటర్ నెవిల్ అర్ధశతకాలు సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో పోరులో 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. డుప్లెసిస్ శతకం సాధించాడు. ఆసీస్ పేసర్లు మిచెల్స్టార్క్, హేజిల్వుడ్ మళ్లీ చెలరేగారు. ఖవాజా శతకం చేయగా స్మిత్, హ్యాండ్స్కాంబ్ అర్ధశతకాలతో మెరిశారు. మూడోసారి మాత్రం పాకిస్థాన్ నుంచి పోటీ ఎదురైంది. 489 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో ఛేదనకు దిగిన పాక్ 450కి ఆలౌటైంది. మరికాస్త పోరాడి ఉంటే విజయం సొంతమయ్యేది. ఇంగ్లాండ్ పోరులోనూ మార్పేమీ లేదు. యాషెస్లో భాగంగా 2018లో జరిగిన ఈ మ్యాచులో కంగారూ జట్టు 120 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. స్టార్క్ (8), లైయన్ (6) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.
పోటీయే లేదు
ఐదో గులాబి పోరుకు ఆసీస్ దాదాపుగా ఏడాది విరామం తీసుకుంది. 2019 జనవరిలో గబ్బా వేదికగా శ్రీలంకతో తలపడింది. పేసర్లు చెలరేగిన ఈ మ్యాచులో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. మొదట లంక 144కి ఆలౌట్ కాగా ఆసీస్ 323 చేసింది. కమిన్స్ (6/23) విజృంభణతో రెండో ఇన్నింగ్స్లో లంక 139కే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో గెలిచింది. అదే ఏడాది నవంబర్లో ఆసీస్×పాక్ రెండో పింక్ టెస్టు ఆసక్తికరంగా సాగింది. డేవిడ్ వార్నర్ త్రిశతకం (335*) చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను 589/3 వద్ద డిక్లేర్ చేసింది. స్టార్క్ 6/66తో దెబ్బకు పాక్ 302కే ఆలౌటైంది. ఫాలోఆన్లో 239 మాత్రమే చేయడంతో ఆసీస్కు ఇన్నింగ్స్ 48 పరుగులతో విజయం లభించింది. ఇక కివీస్తో రెండో పోరులో కంగారూలు 296 పరుగుల తేడాతో గెలిచారు. మిచెల్ స్టార్క్ 9/97తో చెలరేగడమే ఇందుకు కారణం.
బంగ్లాతో 3 రోజులే
ఇక భారత్ విషయానికి వస్తే గులాబి బంతితో అనుభవం కేవలం ఒక్క మ్యాచే. అదీ బంగ్లాదేశ్తో కావడం గమనార్హం. ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), షమి (2/36) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 106కే కుప్పకూలింది. టీమ్ఇండియా పేసర్లు ఒక రకంగా ప్రత్యర్థిని వణికించారనే చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ (136) శతకం బాదేశాడు. చెతేశ్వర్ పుజారా (55), అజింక్య రహానె (51) అర్ధశతకాలు సాధించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 347/9కు డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని ఉమేశ్ (5/53), ఇషాంత్ (4/56) మళ్లీ దెబ్బకొట్టడంతో 195 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో గెలిచింది. అయితే బంగ్లాలో ముష్ఫికర్ రహీమ్ (74) పోరాటం ఆకట్టుకుంది. ఇక ఆసీస్-ఏతో రెండు గులాబి సన్నాహక మ్యాచుల్లో భారత ఆటగాళ్లు ఆశలు రేపారు. హనుమ విహారి, అజింక్య రహానె, రిషభ్ పంత్, చెతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, శుభ్మన్గిల్ సాధికారికంగా ఆడారు. బౌలర్లూ ఫర్వాలేదనిపించారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..