Virender Sehwag: బర్త్డే బాయ్.. వీరేంద్ర సెహ్వాగ్ సరదా ట్వీట్లు
నేడు 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వీరేంద్ర సెహ్వాగ్
ఇంటర్నెట్ డెస్క్: బ్యాటింగ్లో దూకుడుకు మారు పేరు వీరేంద్ర సెహ్వాగ్. అది టెస్టా, వన్డేనా అనే తేడా లేకుండా బాదడమే ‘వీరు’డి లక్ష్యం. 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్ను భారత్ గెలుచుకోవడంలో ఈ డ్యాషింగ్ బ్యాటర్ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 374 అంతర్జాతీయ మ్యాచుల్లో 17వేలకుపైగా పరుగులు చేశాడు. అలాంటి మన వీరేంద్రుడి 43వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 20). 1978లో సరిగ్గా ఇదే రోజున దిల్లీలో సెహ్వాగ్ జన్మించాడు. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సెహ్వాగ్.. రిటైర్మెంట్ తర్వాత సామాజిక మాధ్యమాల్లో విజృంభిస్తున్నాడు. తనదైన శైలిలో ఛలోక్తులు విసరుతూ సమాధానాలు ఇవ్వడం వీరూ స్టైల్. ఇటీవల కాలంలో వీరూ చేసిన పలు పోస్టులు మీ కోసం..
వినోదం కలిగించే పొరపాట్లు
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలుసు. ఐపీఎల్లో ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మిస్టేకులను చాలా సరదాగా వీడియో రూపంలో వీరూ చేసిన పోస్టు భలేగా ఆకట్టుకుంది.
సీఎస్కేకు నాలుగో ఐపీఎల్ టైటిల్
ఐపీఎల్లో సీఎస్కే తిరుగులేని జట్టు. 14వ సీజన్ టైటిల్ను సీఎస్కే సొంతం చేసుకుంది. ఇది ఆ జట్టుకు నాలుగో టైటిల్ కావడం విశేషం. ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా నాలుగు అంకెను చూపిస్తూ చేసిన సంజ్ఞను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.
భలేగా లింక్ పెట్టాడే..
ఐపీఎల్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించిన కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ సన్నివేశాన్ని.. ఇంగ్లాండ్, కివీస్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్కు లింక్ పెట్టాడు. కేకేఆర్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి త్రో చేసిన బంతి డీసీ బ్యాటర్ రిషభ్ పంత్కు తాకింది. అయితే అటువైపు అశ్విన్ రన్ కోసం పిలుపు ఇవ్వడంతో పంత్ పరుగు కోసం వెళ్లాడు. బ్యాటర్లు క్రీడాస్ఫూర్తితో పరుగు తీయరేమోనని మోర్గాన్ భావించాడు. ఈ సందర్భాన్ని 2019 వరల్డ్కప్ ఫైనల్లో బెక్స్టోక్స్ పరుగుతో లింక్ పెట్టి పోస్ట్ చేయడం విశేషం.
పెన్సిల్తో రాసుకోవాలట..
ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఈ ఏడాది వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు టెస్టులు ముగిశాక.. కోచ్ రవిశాస్త్రి, ఇతర సిబ్బందికి కరోనా రావడంతో ఐదో టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. టెస్టు మ్యాచ్ను తర్వాత నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ క్రమంలో సెహ్వాగ్ విసిరిన చమత్కార పోస్టు నవ్వులు పూయించింది. ఐదోటెస్టు అని రాసి దాని పక్కన గీత గీచాడు. అయితే అక్కడ పెన్సిల్తో పూరించాలని ట్విటర్లో పోస్టు పెట్టాడు.
గురువు నేర్పిన పాఠం
లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో లోయర్ ఆర్డర్లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ (60) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ను అభినందిస్తూ ట్వీట్ చేసిన సెహ్వాగ్.. గిఫ్ట్ ఇచ్చాడని పేర్కొన్నాడు. శార్దూల్ను చూసి మిగతా బ్యాటర్లు నేర్చుకోవాలనే ఉద్దేశాన్ని అందులో చెప్పకనేచెప్పాడు.
కృష్ణాష్టమి కవిత..
కృష్ణాష్టమి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన కవితను ట్విటర్లో పోస్టు చేశాడు. హిందీలో చేసిన ఆ పోస్టుకు భారీ సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి.
భాషాభేదాలు లేవని నిరూపించాడుగా..
ఆటకు ప్రాంతం, మతం, కులం అనే భేదాలు ఉండవు. అలానే వాటన్నింటికీ అతీతంగా ఉంటానని సెహ్వాగ్ చెబుతుంటాడు. ఏ ప్రాంతంవారికైనా తమ భాషలోనే శుభాకాంక్షలు చెప్పడం సెహ్వాగ్ ప్రత్యేకత. ఓనం సందర్భంగా మళయాళంలో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
టెస్టులకు ఇదొక సూపర్ ఏడాది
సెహ్వాగ్కు టెస్టు క్రికెట్ అంటే ఎనలేని మక్కువ. ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకు టెస్టులను ఆడేందుకు వెళ్లింది. దానిని ఉదహరిస్తూ చేసిన ట్వీట్ ఆకట్టుకుంది.
బుమ్రా, షమీని వదల్లేదు
కవితకు అనర్హం ఏదీ లేదంటాడు కవి. సెహ్వాగ్కు కూడా ట్వీట్ చేయడానికి ప్రతిదీ కథావస్తువే. ఇంగ్లాండ్పై అద్భుత బ్యాటింగ్తో చెలరేగిన బుమ్రా, షమీలనూ వదల్లేదు. తనదైన శైలిలో వారిపై మీమ్స్తో ఫన్నీగా ఆడేసుకున్నాడు.
కొవిడ్ మార్గదర్శకాలతో బాల్ టాంపిరింగ్!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ను ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఆ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతిని తొక్కుతున్న ఫొటోను సెహ్వాగ్ షేర్ చేశాడు. కొవిడ్ నిబంధనలతో ఇంగ్లాండ్ బాల్ టాంపిరింగ్కు పాల్పడిందని సరదాగా ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ