Rohit Sharma : నా దృష్టిలో రోహితే అత్యుత్తమ ఆటగాడు: హర్భజన్ సింగ్
టీమ్ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మే తన దృష్టిలో అత్యుత్తమ ఆటగాడని మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చెప్పాడు. అలాగే, బుమ్రా తన ఫేవరెట్ బౌలర్ అని పేర్కొన్నాడు...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మే తన దృష్టిలో అత్యుత్తమ ఆటగాడని మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చెప్పాడు. అలాగే, బుమ్రా తన ఫేవరెట్ బౌలర్ అని పేర్కొన్నాడు. ‘‘నా ఫేవరెట్ బ్యాటర్ రోహిత్ శర్మ. టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్తో సంబంధం లేకుండా గొప్పగా రాణించగలడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా చాలా కాలం ఆడుతాడు. భారత బ్యాటింగ్ను మరింత బలోపేతం చేయగలడనే నమ్మకం ఉంది. బహుశా ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అనుకుంటున్నాను. అలా అని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయడం లేదు. వాళ్లిద్దరు కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. కానీ, రోహిత్ తన బ్యాటింగ్తో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అందుకే, అతడే నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా నా ఫేవరెట్. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. ఫార్మాట్తో సంబంధం లేకుండా గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే వీళ్లిద్దరూ నా అభిమాన క్రికెటర్లలయ్యారు’’ అని హర్భజన్ పేర్కొన్నాడు.
రోహిత్ వద్దంటే.. బుమ్రాకు ఓ అవకాశం ఇవ్వాలి..
టెస్టు కెప్టెన్సీ విషయంలో కూడా హర్బజన్ సింగ్.. బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. ‘ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మనే టెస్టు పగ్గాలు కూడా చేపడితే బాగుంటుంది. ఒక వేళ రోహిత్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేకపోతే.. మరో ఆలోచన లేకుండా బుమ్రాకే ఆ బాధ్యతలు అప్పగించాలి. భారత్లో ఫాస్ట్ బౌలర్లకు సారథ్య బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. టీమ్ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ కూడా బౌలరే కదా! మరో సారి బౌలర్కు ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు? ప్రస్తుతం భారత జట్టులోని మ్యాచ్ విన్నర్ల కంటే బుమ్రా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులు గెలిపించాడు’ అని హర్భజన్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్