Team India: ఎనిమిది ఫైనల్స్.. ఏడు టైటిల్స్.. వీరే కెప్టెన్స్..!
మహిళల ఆసియా కప్ చరిత్రలో టీమ్ఇండియాది సువర్ణాధ్యాయం. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు టోర్నీలు జరగగా.. ఏడు టైటిళ్లను భారత్ గెలుచుకోవడం అద్భుతం. తొలి ఆసియా కప్ నుంచి తాజాగా జరిగిన టోర్నీ వరకు ఏ కెప్టెన్ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుందో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. ఆసియాకప్లో చరిత్ర సృష్టించారు. ఏడో టైటిల్ను సాధించారు. 2004లో రెండు జట్లతో ప్రారంభమైన మహిళల ఆసియాకప్లో తాజాగా ఏడు దేశాల జట్లు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు టోర్నమెంట్ జరిగింది. అంతేకాకుండా ఫైనల్లో భారత్కు ఐదు సార్లు శ్రీలంక ప్రత్యర్థి కావడం గమనార్హం. తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ గెలిచింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సారథ్యంలో అత్యధికంగా నాలుగు టైటిళ్లను అందుకోవడం ఒక రికార్డే.
- తొలి కప్ ‘మమత’ (2004): శ్రీలంక వేదికగా మహిళల కోసం 18 ఏళ్ల కిందట రెండు జట్లతో ఆసియా కప్ ప్రారంభమైంది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీ తొలి టైటిల్ను టీమ్ఇండియా కైవసం చేసుకొంది. కెప్టెన్గా మమతా మబెన్ వ్యవహరించింది. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్లు నిర్వహించగా.. 5-0 తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో మొదటి టైటిల్ భారత్ వశమైంది.
- మిథాలీ సారథ్యంలోనే..(2005/06): ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మొదటిసారిగా 2005లో ఆసియా కప్ టైటిల్ను అందుకొంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండో కప్ను ఖాతాలో వేసుకొంది. అయితే ఈసారి భారత్-లంక కాకుండా మూడో జట్టు వచ్చి చేరింది. అదే దాయాది దేశం పాకిస్థాన్. 2005 ఆసియా కప్ను అక్కడే నిర్వహించారు. మూడు టీమ్లు కలిసి లీగ్ స్టేజ్లో ఆరు మ్యాచ్లు ఆడాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అలాగే 2006లో జరిగిన కప్నూ మిథాలీరాజ్ కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకొంది. రెండుసార్లూ లంకనే ప్రత్యర్థి. వేదిక భారత్ కావడవం విశేషం.
- నాలుగుకు పెరిగినా.. (2008): ఈసారి టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల సంఖ్య 4కి చేరింది. కొత్తగా బంగ్లాదేశ్ టీమ్ వచ్చింది. గ్రూప్లో భారత్, శ్రీలంక జట్లు టాపర్లుగా నిలిచి ఫైనల్కు చేరుకొన్నాయి. టీమ్ఇండియా ఆరు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. లంక నాలుగు గెలిచి.. రెండింట్లో ఓడింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కేవలం ఒక్కో విజయంతోనే సరిపెట్టుకొన్నాయి. తుదిపోరులోనూ లంకను కెప్టెన్ మిథాలీరాజ్ నాయకత్వంలోని భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది.
- ఎనిమిది జట్లు (2012): అంతకుముందు జరిగిన ఆసియా కప్ పోటీలకు 2012 ఆసియా కప్ టోర్నీకి నాలుగేళ్ల వ్యవధి ఉండటం గమనార్హం. అయితే ఈ సారి ఏకంగా ఎనిమిది జట్లు తలపడ్డాయి. తొలిసారిగా టీ20 ఫార్మాట్ను ప్రవేశపెట్టారు. మొదటిసారి చైనా ఆతిథ్యం ఇవ్వడంతోపాటు పాల్గొంది. రెండు గ్రూప్లుగా విడిపోయిన జట్లు.. నాకౌట్ దశకు మాత్రం నాలుగే చేరాయి. భారత్-శ్రీలంక ఈసారి సెమీస్లోనే ఢీకొట్టుకోగా.. బంగ్లాదేశ్-పాకిస్థాన్ మొదటిసారి సెమీఫైనల్కు వచ్చాయి. అయితే ఫైనల్కు టీమ్ఇండియా-పాక్ చేరుకోగా.. టైటిల్ను భారత్ సొంతం చేసుకొంది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించగా.. హర్మన్ డిప్యూటీగా వ్యవహరించింది.
- మళ్లీ పాక్నే ప్రత్యర్థి (2016): భారత్కు వరుసగా రెండోసారి ఫైనల్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా తలపడింది. అయితే ఈసారి మాత్రం ఆరు జట్లతోనే ఆసియా కప్ జరిగింది. హాంకాంగ్, చైనా పాల్గొనలేదు. థాయ్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో ఆరు జట్లూ మిగతా టీమ్లతో రెండేసి మ్యాచ్లను ఆడాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు వచ్చాయి. అలా భారత్-పాక్ మరోసారి తలపడగా.. టీమ్ఇండియానే విజయం సాధించి కప్ను ఖాతాలో వేసుకొంది. తొలిసారి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గెలిచిన టైటిల్.
- ఇప్పుడు శ్రీలంకపైనే (2022): హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ 2018 ఆసియా కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడినా ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ 2022లో కసిగా దిగిన టీమ్ఇండియా ఆద్యంతం దూకుడుగానే ఆడింది. ఒక్క మ్యాచ్ మినహా అన్నింట్లోనూ విజయం సాధించి టైటిల్ను పట్టేసింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా దీప్తి శర్మ.. ఫైనల్లో ప్లేయర్ ది మ్యాచ్ అవార్డును రేణుకా సింగ్ అందుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM