Womens T20 Challenge : హర్మన్‌ టీమ్‌పై దీప్తి శర్మ జట్టు ఘన విజయం

మహిళల టీ20 ఛాలెంజ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టుపై దీప్తి శర్మ టీమ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన..

Updated : 24 May 2022 19:44 IST

పుణె: మహిళల టీ20 ఛాలెంజ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టుపై దీప్తి శర్మ టీమ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ టీమ్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది. షెఫాలీ వర్మ (51), లారా వాల్వార్డ్‌ (51) అర్ధశతకాలు సాధించారు. దీప్తి శర్మ (24*), యస్తిక భాటియా (17) ఫర్వాలేదనిపించారు. హర్మన్‌ జట్టు బౌలర్లలో డీనాద్ర డాటిన్‌ 2, పూజ వస్త్రాకర్‌ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ జట్టులో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (71) అర్ధశతకం సాధించింది. తానియా భాటియా (36), సునె లాస్ (20*) మినహా ఎవరూ రాణించలేదు. ప్రియా పునియా 4, డాటిన్ 6, హర్లీన్‌ డియోల్ 7, పూజ వస్త్రాకర్ 2 పరుగులు చేశారు. దీప్తి శర్మ జట్టులో కేట్ క్రాస్ 2.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు