IND w Vs IRE w: మ్యాచ్కు వరుణుడి అంతరాయం.. ఐదు పరుగుల ముందంజలో భారత్
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది.
గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. టీమ్ఇండియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఐర్లాండ్ 8.2 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం 8.2 ఓవర్లకు స్కోర్ 59 ఉండాలి. ఈ లెక్కన చూసుకుంటే ఐర్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రేణుకా సింగ్ గట్టి షాక్ ఇచ్చింది. అమీ హంటర్ (1), ఓర్లా ప్రెండర్గాస్ట్ (0)లను పెవిలియన్కు పంపింది. అనంతరం డెలానీ, లూయిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. పూజా వస్త్రాకర్ వేసిన నాలుగో ఓవర్లో చెరో ఫోర్ బాదారు. దీప్తి శర్మ వేసిన ఆరో ఓవర్లో లూయిస్ రెండు ఫోర్లు కొట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్లో రకుల్
-
India News
Odisha Train Tragedy: ‘కవచ్ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్ రూపకర్త
-
General News
CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ
-
General News
Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్
-
Movies News
Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి