IND w Vs IRE w: దంచికొట్టిన స్మృతి మంధాన.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం

మహిళల టీ20 ప్రపంచకప్ (‌Womens T20 World Cup) లో భాగంగా గ్రూప్‌ బిలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ పూర్తయింది.

Updated : 20 Feb 2023 20:22 IST

గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్ (‌Womens T20 World Cup) లో భాగంగా గ్రూప్‌ బిలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ పూర్తయింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (87; 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్‌ఇండియా 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (24), జెమీమీ రోడ్రిగ్స్‌ (19) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో లారా డెలానీ 3, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, ఆర్లీన్ కెల్లీ ఒక వికెట్‌ తీశారు.

తొలుత ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 10 ఓవర్లలో 63/1తో నిలిచింది హర్మత్‌ సేన. అనంతరం మంధాన దూకుడు పెంచింది.  కారా ముర్రే వేసిన 14 ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 47 వద్ద స్మృతికి లైఫ్‌ లభించిన తర్వాత అదే ఓవర్‌లో చివరి బంతికి సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకుంది. జార్జినా డెంప్సే వేసిన 15 ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మంధాన.. డెలానీ వేసిన తర్వాతి ఓవర్‌లో సిక్సర్‌ బాదింది. కానీ, ఇదే ఓవర్‌లో హర్మన్‌ (13), రిచా ఘోష్‌ (0)లు ఔటయ్యారు. డెలానీ వేసిన 18 ఓవర్‌లో మంధాన ఫోర్‌, సిక్సర్‌ మరోసారి జోరు చూపించింది. కానీ, ప్రెండర్‌గాస్ట్ వేసిన 18.4 ఓవర్‌కు గాబీ లూయిస్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. తర్వాతి బంతికే దీప్తి శర్మ (0) డకౌట్‌ అయింది. ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన జెమీమా రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ చివరి బంతికి స్టంపౌట్‌ అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని