INDvsENG: డ్రా చేసుకున్న మహిళా టీమ్ఇండియా
ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టును టీమ్ఇండియా జట్టు డ్రా చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 396/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ హెదర్నైట్(95), సోఫియా డంక్లీ(74) అర్ధశతకాలతో రాణించారు...
రెండో ఇన్నింగ్స్లో రాణించిన షెఫాలీ, దీప్తి, స్నేహ రాణా
బ్రిస్టల్: ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టును టీమ్ఇండియా జట్టు డ్రా చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 396/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ హెదర్నైట్(95), సోఫియా డంక్లీ(74) అర్ధశతకాలతో రాణించారు. ఆపై టీమ్ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన(78), షెఫాలీ వర్మ(96) దంచికొట్టినా మిగతా సభ్యులు విఫలమయ్యారు. దాంతో భారత్ 231 పరుగులకే కుప్పకూలి 165 పరుగుల వెనుకంజలో నిలిచింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఫాలోఆన్ ఆడిన భారత్ మూడోరోజు ఆట నిలిచే సమయానికి 83/1 స్కోర్తో నిలిచింది. ఇక చివరి రోజు శనివారం ఆట కొనసాగించిన టీమ్ఇండియా మరో ఏడు వికెట్లు కోల్పోయి ఇంకో 261 పరుగులు చేసింది. దాంతో ఆట నిలిచిపోయేసరికి భారత్ 344/8 స్కోర్ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(63), దీప్తి శర్మ(54), స్పేహ రాణా(80*) అద్భుతంగా ఆడారు. చివరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM